ఒమన్-ఇండియా మధ్య విమానాల పై స్పష్టత
- June 16, 2021
మస్కట్: ఒమన్ మరియు భారతదేశం మధ్య విమానాల విషయమై సివిల్ ఏవియేషన్ అథారిటీ స్పష్టతనిచ్చింది. కోవిడ్ 19 నేపథ్యంలో ఏర్పాటైన సుప్రీం కమిటీ జారీ చేసిన నిర్ణయాలకు అనుగుణంగా మాత్రమే ఒమన్ మరియు భారతదేశం మధ్య విమానాలు నడవడం ఆధారపడి వుంటుందని సిఎఎ పేర్కొంది. భారతదేశానికి తిరిగి వెళ్ళాలనుకుంటున్న వారి కోసం ప్రత్యేకంగా విమానాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. వైద్య సంబంధిత పరికరాలు, మందులు వంటివాటిని తరలించేందుకూ వీటిని వినియోగిస్తారు. పౌరులు తిరిగి ఒమన్ రావడానికి, డిప్లమాట్స్, హెల్త్ వర్కర్లు వంటివారిని ఇండియా నుంచి తీసుకొచ్చేందుకు వీటిని వినియోగిస్తారు. తక్కువ సంఖ్యలో ఒమన్ వచ్చే డిప్లమాట్లు, ఒమనీయులు, హెల్త్ వర్కర్లు వంటివారికి సంబంధించి రీ-ఎగ్జామినేషన్ కరోనా పరీక్ష విషయమై జరుగుతుంది. వారికి సంబంధిత నిబంధనల ప్రకారం క్వారంటైన్ వుంటుంది. క్వారంటైన్ సమయం ముగిశాక మరోసారి వారికి టెస్ట్ చేస్తారు. జూన్ 3 నుంచి జూన్ 13 మధ్య నడిచిన విమానాలు, వచ్చిన వారి వివరాలు ఇలా వున్నాయి.
1. ఒమన్ ఎయిర్ మొత్తంగా 14 విమానాలు నడిపింది. 58 మంది ప్రయాణీకులు రాగా, అందులో 14 మంది పౌరులు, 44 మంది విదేశీయులు. ఒక్కో విమానంలో 5 మంది కంటే తక్కువ ప్రయాణీకులున్నారు. వీళ్ళంతా మినహాించబడిన కేటగిరీలకు చెందినవారు.
2. సలామ్ ఎయిర్ ఒకే ఒక్క విమానాన్ని నడిపింది. ఇద్దరు ప్రయాణీకులు మాత్రమే వచ్చారు.
3. ఎయిర్ ఇండియా 8 విమానాల్ని నడపగా 34 మంది ప్రరయాణీకులు వచ్చారు. ఒకరు పౌరుడు కాగా, 33 మంది విదేశీ ప్రయాణీకులు. ఒక్కో విమానానికీ 5గురి కంటే తక్కువ ప్రయాణీకులున్నారు.
4. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 11 విమానాల్ని నడపగా 47 మంది ప్రయాణీకులు వచ్చారు. వీరిలో ఇద్దరు పౌరులు, 45 మంది విదేశీ ప్రయాణీకులు. ఒక్కో విమానానికీ 5గురి కంటే తక్కువ ప్రయాణీకులున్నారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







