శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి డ్రగ్స్ కలకలం..
- June 21, 2021
హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో భారీగా అక్రమ డ్రగ్స్ రవాణా గుట్టురట్టైంది. విదేశాల నుంచి యథేచ్చగా అక్రమ దందా నిర్వహిస్తున్న కేటుగాళ్లకు డీఆర్ఐ అధికారులు చెక్ పెట్టారు. శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. రూ.20 కోట్ల విలువైన హెరాయిన్ను విమానాశ్రయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
టాంజానియా నుంచి వచ్చిన జాన్ విలియమ్స్ అనే వ్యక్తి నుంచి దీన్ని మత్తు మందును స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ అక్రమ రవాణాపై ఆరా తీస్తున్నారు. అతనికి హైదరాబాద్తో ఉన్న లింకులపై కూపీ లాగుతున్నారు. ఇటీవల అంతర్జాతీయంగా డ్రగ్స్ సరఫరా పెరిగిందన్న నిఘా వర్గాల సమాచారంతో అధికారులు.. ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఇదే క్రమంలోనే హైదరాబాద్, చెన్నై వంటి విమానాశ్రయాల్లో అప్పుడప్పుడు డ్రగ్స్ పట్టుబడుతూ వస్తోంది. జాన్ విలియమ్స్ను అరెస్ట్ చేసిన డీఆర్ఐ అధికారులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- రేపే RBI పాలసీ నిర్ణయం..
- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్
- మహిళా సంఘాలకు మరో తీపి కబురు తెలిపిన రేవంత్ ప్రభుత్వం
- ట్రంప్ ఇరాన్ వార్ వార్నింగ్: 24 గంటల్లో విధ్వంసం అంటూ సంచలనం
- తెలంగాణ జర్నలిస్టులకు కీలక అప్డేట్
- సౌదీ అరేబియాలో 69 అడ్మిన్ సపోర్టు ఉద్యోగాలు లోకలైజ్..!!
- ఊరట..మూడవ ఏడాది ఫీజులను ఫ్రీజ్ చేసిన దుబాయ్ స్కూల్..!!
- వాటర్ సర్కస్ః కొత్త తేదీలను ప్రకటించిన విజిట్ ఖతార్..!!
- ఆహార భద్రతా వారోత్సవాల అవగాహన ప్రదర్శన ప్రారంభం..!!
- ప్రభావిత ప్రాంతాలను సందర్శించవద్దు..కువైట్ లో అలెర్ట్..!!









