నర్సరీలకు కోవిడ్ 19 మార్గదర్శకాలు సవరించిన అబుధాబి
- June 21, 2021
అబుధాబి: ఎమిరేట్ లో నిర్వహించబడుతోన్న పిల్లల నర్సరీలకు సంబంధించి సవరించిన మార్గదర్శకాల్ని అబుధాబి అథారిటీస్ సోమవారం విడుదల చేశాయి. కొత్త రూల్స్ జులై 1 నుంచి అమల్లోకి వస్తాయి. ప్రతి ‘బబుల్’కీ 8 నుంచి 12 మంది వరకు చిన్నారుల సంఖ్యను పెంచారు. 45 రోజుల నుంచి రెండేళ్ళ వయసు చిన్నారుల వరకు ఇది వర్తిస్తుంది. 2 నుంచి నాలుగేళ్ళ వయసు చిన్నారులు 10 నుంచి 16 మంది ‘బబుల్’లో వుండొచ్చు. పాజిటివ్ కేసు రిపోర్ట్ అయితే బబుల్ 10 రోజుల పాటు మూసి వేయాల్సి వుంటుంది. 3 లేదా ఎక్కువ బబుల్స్ కరోనా బారిన పడితే నర్సరీ మొత్తం 10 రోజులపాటు మూసెయ్యాల్సి వుంటుంది. ప్రతి ఇద్దరు చిన్నారులకు క్లాస్ రూములో దూరం 3.5 చదరపు మీటర్లు వుండాలి. బహిరంగ ప్రదేశాల్లో ఇది 5 చదరపు మీటర్లు వుండాలి.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- విదేశీ ప్రయాణాలు చౌక.. TCS 2 శాతానికి తగ్గింపు
- సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన అంతర్జాతీయ గుర్తింపు
- లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- హైదరాబాద్లో మరో కొత్త షాపింగ్ మాల్..
- ఓల్డ్ గల్ఫ్ ప్లేట్ కార్ల రిజిస్ట్రేషన్ ఫీజు యథాతథం..!!
- యూఏఈలో పెట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. Dh1,000 వరకు జరిమానాలు..!!
- కువైట్ లో సైరన్ల టెస్ట్ రన్ టైమ్ లో మార్పులు..!!
- ఖతార్లో ఏడు రెస్టారెంట్లతో సహా 12 ఆహార సంస్థలు మూసివేత..!!
- భారత్-అరబ్ బంధం బలోపేతం..!!
- మస్కట్ నైట్స్: ముగిసి అర్ధా ఒంటెల రేసు..!!







