నర్సరీలకు కోవిడ్ 19 మార్గదర్శకాలు సవరించిన అబుధాబి
- June 21, 2021
అబుధాబి: ఎమిరేట్ లో నిర్వహించబడుతోన్న పిల్లల నర్సరీలకు సంబంధించి సవరించిన మార్గదర్శకాల్ని అబుధాబి అథారిటీస్ సోమవారం విడుదల చేశాయి. కొత్త రూల్స్ జులై 1 నుంచి అమల్లోకి వస్తాయి. ప్రతి ‘బబుల్’కీ 8 నుంచి 12 మంది వరకు చిన్నారుల సంఖ్యను పెంచారు. 45 రోజుల నుంచి రెండేళ్ళ వయసు చిన్నారుల వరకు ఇది వర్తిస్తుంది. 2 నుంచి నాలుగేళ్ళ వయసు చిన్నారులు 10 నుంచి 16 మంది ‘బబుల్’లో వుండొచ్చు. పాజిటివ్ కేసు రిపోర్ట్ అయితే బబుల్ 10 రోజుల పాటు మూసి వేయాల్సి వుంటుంది. 3 లేదా ఎక్కువ బబుల్స్ కరోనా బారిన పడితే నర్సరీ మొత్తం 10 రోజులపాటు మూసెయ్యాల్సి వుంటుంది. ప్రతి ఇద్దరు చిన్నారులకు క్లాస్ రూములో దూరం 3.5 చదరపు మీటర్లు వుండాలి. బహిరంగ ప్రదేశాల్లో ఇది 5 చదరపు మీటర్లు వుండాలి.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







