నర్సరీలకు కోవిడ్ 19 మార్గదర్శకాలు సవరించిన అబుధాబి
- June 21, 2021
అబుధాబి: ఎమిరేట్ లో నిర్వహించబడుతోన్న పిల్లల నర్సరీలకు సంబంధించి సవరించిన మార్గదర్శకాల్ని అబుధాబి అథారిటీస్ సోమవారం విడుదల చేశాయి. కొత్త రూల్స్ జులై 1 నుంచి అమల్లోకి వస్తాయి. ప్రతి ‘బబుల్’కీ 8 నుంచి 12 మంది వరకు చిన్నారుల సంఖ్యను పెంచారు. 45 రోజుల నుంచి రెండేళ్ళ వయసు చిన్నారుల వరకు ఇది వర్తిస్తుంది. 2 నుంచి నాలుగేళ్ళ వయసు చిన్నారులు 10 నుంచి 16 మంది ‘బబుల్’లో వుండొచ్చు. పాజిటివ్ కేసు రిపోర్ట్ అయితే బబుల్ 10 రోజుల పాటు మూసి వేయాల్సి వుంటుంది. 3 లేదా ఎక్కువ బబుల్స్ కరోనా బారిన పడితే నర్సరీ మొత్తం 10 రోజులపాటు మూసెయ్యాల్సి వుంటుంది. ప్రతి ఇద్దరు చిన్నారులకు క్లాస్ రూములో దూరం 3.5 చదరపు మీటర్లు వుండాలి. బహిరంగ ప్రదేశాల్లో ఇది 5 చదరపు మీటర్లు వుండాలి.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!
- ప్రాంతీయ పరిణామాలపై కువైట్, ఒమన్ చర్చలు..!!









