తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయి: గవర్నర్‌ నరసింహన్‌

- March 09, 2016 , by Maagulf
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయి: గవర్నర్‌ నరసింహన్‌

 తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగాలని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. కారణాలేవైనా..ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని చెప్పారు. స్కౌట్స్‌, గైడ్స్‌ ఉద్యమం ముందుకు తీసుకెళ్లేందుకు ఇరు ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్ఛభారత్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని ప్రతి నెలలో కనీసం ఒక రోజు స్కౌట్స్‌, గైడ్స్‌ చేపట్టి యువతకు చక్కటి సందేశం ఇవ్వాలని స్పష్టం చేశారు. భారత్‌ స్కౌట్స్‌, గైడ్స్‌ విభజన ప్రక్రియ పూర్తయిన సందర్భంగా ఇవాళ హైదరాబాద్‌ రవీంద్రభారతిలో జరిగిన భారత్‌ స్కౌట్స్‌, గైడ్స్‌ తెలుగు రాష్ట్రాల సాధారణ కౌన్సిల్‌ సమావేశానికి గవర్నర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com