రాత్రి 8 గంటల తర్వాత కూడా దుకాణాలకు గ్రీన్ సిగ్నల్
- July 27, 2021
కువైట్: కోవిడ్ నేపథ్యంలో విధించిన ఆంక్షల్లో పలు సవరణలు చేసింది కువైట్ ప్రభుత్వం. రాత్రి ఎనిమిది తర్వాత దుకాణాలు, ఇతర వాణిజ్య కేంద్రాలను మూసివేయాలన్న నిర్ణయాన్ని రద్దు చేసింది. ప్రతి వారం నిర్వహించే మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిమండలి అధికార ప్రతినిధి వెల్లడించారు. ప్రస్తుతం కువైట్లో దుకాణాల నిర్వహణ, ఇతర వాణిజ్య లావాదేవీలపై ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు. అయితే..జనం గ్యాదర్ అయ్యే ఎలాంటి కార్యక్రమాలను అనుమతించటం లేదని వెల్లడించారు. పెళ్లిళ్లు, కాన్ఫరెన్స్, సభలు, పిల్లలతో నిర్వహించే ఈవెంట్లపై సెప్టెంబర్ వరకు ఆంక్షలు కంటిన్యూ అవుతాయి. ఇదిలాఉంటే..వ్యాక్సిన్ తీసుకున్నవారికి దేశవ్యాప్తంగా అనుమతితో నిర్వహించే అన్ని ఈవెంట్లకు ఎంట్రీ ఉంటుందని, అదే వ్యాక్సిన్ తీసుకోని వారికి ఫార్మసీలు, కోపరేటీవ్ సొసైటీలు, మార్కెట్లు, ఫుడ్&క్యాటరింగ్ కేంద్రాల్లోకి మాత్రమే అనుమతించనున్నారు.
తాజా వార్తలు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్









