వ్యాక్సిన్ తీసుకోని వారికి పబ్లిక్ ప్లేసుల్లోకి నో ఎంట్రీ
- July 27, 2021
సౌదీ: కోవిడ్ వ్యాప్తిని పకడ్బందీగా నిర్వహించేందుకు వ్యాక్సిన్ తీసుకోవటం ఒక్కటే మార్గం. అందుకే దేశ ప్రజలు, ప్రవాసీయులు వీలైనంత ఎక్కువ సంఖ్యలో వ్యాక్సిన్ తీసుకునేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్న సౌదీ ప్రభుత్వం...ఇక వ్యాక్సిన్ తీసుకోని వారికి ఆంక్షల చట్రం బిగిస్తోంది. వ్యాక్సిన్ తీసుకోని వారు బయట తిరక్కుండా నిబంధనలు విధిస్తోంది. ఇక నుంచి టీకా తీసుకోని వ్యక్తులను ప్రభుత్వ భవనాల్లోకి అనుమతించొద్దని కింగ్డమ్ ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే దేశవ్యాప్తంగా ఎలాంటి కార్యక్రమాలు జరిగినా టీకా తీసుకోని వారికి అనుమతి ఉండదు. చివరికి పబ్లిక్ ట్రాన్స్ పోర్టేషన్ లోకి కూడా అనుమతి ఉండదు. ఈ నిబంధన ఆగస్టు 1 నుండి అమలులోకి వస్తుందని అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతేకాదు..కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోకుంటే..ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక, వినోదం, క్రీడా కార్యక్రమాలకు హజరయ్యేందుకు అనుమతి ఉండదు. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలోకి ఎంట్రీ ఉండదు. చివరికి వారు ఉద్యోగస్తులు అయినా సరే వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. ఇక వ్యాక్సిన్ తీసుకున్న వారు తవక్కల్నా యాప్లో తమ వ్యాక్సినేషన్ డీటేల్స్ తప్పక చూపించాల్సి ఉంటుంది. వ్యాక్సినేషన్ డీటేల్స్ చెక్ చేసిన తర్వాత ప్రభుత్వ ఆఫీసులు, ప్రజారవాణా, స్కూళ్లలోకి అనుమతినివ్వాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- రేపు హైదరాబాద్కు ప్రధాని మోదీ..
- రోబోటిక్ హిప్ రీప్లేస్మెంట్పై హైదరాబాద్లో జాతీయ సదస్సు
- ఇరాన్ రివల్యూషనరీ గార్డ్తో సంబంధాలున్న గుంపు అరెస్ట్
- సైబర్ కేసుల దర్యాప్తులో బ్యాంకుల సహకారం ముఖ్యం: సైబరాబాద్ సీపీ
- 4 కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి..
- ప్రధాని మోదీ సభకు హైదరాబాద్లో భారీ భద్రతా ఏర్పాట్లు: సీపీ సుమతి
- తెలంగాణ ఉద్యమ సమయంలో ఐటీ కారిడార్ అంతరాయం లేకుండా కొనసాగింది
- భారత రక్షణ దళాల పగ్గాలు కొత్త చేతుల్లోకి: కీలక మార్పుల విశ్లేషణ
- మహబూలాలో ఇల్లీగల్ స్ట్రీట్ స్టాల్స్ సీజ్..!!
- రాస్ జువాయెడ్ సమీపంలో సముద్రంలో పడి వ్యక్తి మృతి..!!









