తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- August 02, 2021
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా కిందికి దిగివస్తున్నాయి.రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 1,07,472 శాంపిల్స్ను పరీక్షించగా 591 మందికి కరోనా పాజిటివ్గా తేలింది.మరో ఇద్దరు కోవిడ్ బాధితులు మృతి చెందారు.ఇదే సమయంలో.. 643 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారని బులెటిన్లో పేర్కొంది ప్రభుత్వం.దీంతో.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,45,997కు పెరగగా.. కోలుకున్న వారి సంఖ్య 6,33,371కు చేరింది.. ఇక, కోవిడ్తో ఇప్పటి వరకు 3,807 మంది కన్నుమూశారు.మరోవైపు రాష్ట్రంలో రికవరీ రేటు 98.04 శాతంగా ఉందని తెలిపింది ప్రభుత్వం.. ప్రస్తుతం 8,819 యాక్టివ్ కేసులు రాష్ట్రంలో ఉన్నాయని పేర్కొంది.ఇక తాజా కేసుల్లో అత్యధికంగా కరీంనగర్లో 75 కొత్త కేసులు వెలుగు చూడగా…GHMCలో 68, ఖమ్మంలో 58, వరంగల్ అర్బన్లో 51 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







