తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- August 02, 2021
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా కిందికి దిగివస్తున్నాయి.రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 1,07,472 శాంపిల్స్ను పరీక్షించగా 591 మందికి కరోనా పాజిటివ్గా తేలింది.మరో ఇద్దరు కోవిడ్ బాధితులు మృతి చెందారు.ఇదే సమయంలో.. 643 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారని బులెటిన్లో పేర్కొంది ప్రభుత్వం.దీంతో.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,45,997కు పెరగగా.. కోలుకున్న వారి సంఖ్య 6,33,371కు చేరింది.. ఇక, కోవిడ్తో ఇప్పటి వరకు 3,807 మంది కన్నుమూశారు.మరోవైపు రాష్ట్రంలో రికవరీ రేటు 98.04 శాతంగా ఉందని తెలిపింది ప్రభుత్వం.. ప్రస్తుతం 8,819 యాక్టివ్ కేసులు రాష్ట్రంలో ఉన్నాయని పేర్కొంది.ఇక తాజా కేసుల్లో అత్యధికంగా కరీంనగర్లో 75 కొత్త కేసులు వెలుగు చూడగా…GHMCలో 68, ఖమ్మంలో 58, వరంగల్ అర్బన్లో 51 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- ఫ్లైట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.. GACA పిలుపు..!!
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ









