తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

- August 02, 2021 , by Maagulf
తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా కిందికి దిగివస్తున్నాయి.రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్‌ బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో 1,07,472 శాంపిల్స్‌ను పరీక్షించగా 591 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.మరో ఇద్దరు కోవిడ్‌ బాధితులు మృతి చెందారు.ఇదే సమయంలో.. 643 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారని బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.దీంతో.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,45,997కు పెరగగా.. కోలుకున్న వారి సంఖ్య 6,33,371కు చేరింది.. ఇక, కోవిడ్‌తో ఇప్పటి వరకు 3,807 మంది కన్నుమూశారు.మరోవైపు రాష్ట్రంలో రికవరీ రేటు 98.04 శాతంగా ఉందని తెలిపింది ప్రభుత్వం.. ప్రస్తుతం 8,819 యాక్టివ్‌ కేసులు రాష్ట్రంలో ఉన్నాయని పేర్కొంది.ఇక తాజా కేసుల్లో అత్యధికంగా కరీంనగర్‌లో 75 కొత్త కేసులు వెలుగు చూడగా…GHMCలో 68, ఖమ్మంలో 58, వరంగల్‌ అర్బన్‌లో 51 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com