అబుధాబి స్కూళ్లల్లో ప్లే ఏరియా, క్యాంటిన్ కు గ్రీన్ సిగ్నల్
- August 03, 2021
అబుధాబి: వ్యాక్సినేషన్ ముమ్మరం చేసిన తర్వాత స్కూళ్లను ప్రారంభించాలని నిర్ణయించిన అబుధాబి పాలక వర్గం...స్కూళ్లలో మునుపటిలా సాధారణ పరిస్థితులు నెలకొల్పే దిశగా డిసిషన్ తీసుకుంది. గ్రౌండ్లో ఆటలు ఆడేందుకు, స్కూల్ క్యాటింన్, ఫిజికల్ ఎడ్యూకేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వేసవి సెలవులు ముగిసిన తర్వాత సెప్టెంబర్ లో తిరిగి స్కూళ్లలను ప్రారంభించాలని అబుధాబి నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే..కోవిడ్ నేపథ్యంలో విద్యార్ధుల భద్రతకు తగిన ప్రమాణాలతో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఎడ్యూకేషన్&నాలెడ్జ్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. ఫిజికల్ డిస్టెన్స్ కోసం క్లాసు రూంలలో ప్రతి విద్యార్ధికి మధ్య మీటర్ ఎడం ఉండేలా సీటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఇందుకోసం అదనపు తరగతి గదులను కూడా సిద్ధం చేస్తున్నారు. స్కూల్ గ్రౌండ్, క్యాంటిన్, ఇతర కామన్ ఏరియాల్లోనూ ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా చర్యలు తీసుకుంటామన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు, ఇతర కారణాలతో వ్యాక్సిన్ తీసుకోని వారికి ఆన్ లైన్ క్లాసెస్ ఆప్షన్ కూడా ఉందన్నారు.
తాజా వార్తలు
- అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!
- జాతీయ హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసిన ఖతార్..!!
- బహ్రెయిన్లో ఓవర్స్టే ఫైన్ మినహాయింపు..!!
- కువైట్ లో కాన్సర్ట్, పార్టీల పై నిషేధం..!!
- సయ్యద్ ఫహద్ అల్ సయీద్ కన్నుమూత..!!
- ఫ్లైట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.. GACA పిలుపు..!!
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్









