అబుధాబి స్కూళ్లల్లో ప్లే ఏరియా, క్యాంటిన్ కు గ్రీన్ సిగ్నల్
- August 03, 2021
అబుధాబి: వ్యాక్సినేషన్ ముమ్మరం చేసిన తర్వాత స్కూళ్లను ప్రారంభించాలని నిర్ణయించిన అబుధాబి పాలక వర్గం...స్కూళ్లలో మునుపటిలా సాధారణ పరిస్థితులు నెలకొల్పే దిశగా డిసిషన్ తీసుకుంది. గ్రౌండ్లో ఆటలు ఆడేందుకు, స్కూల్ క్యాటింన్, ఫిజికల్ ఎడ్యూకేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వేసవి సెలవులు ముగిసిన తర్వాత సెప్టెంబర్ లో తిరిగి స్కూళ్లలను ప్రారంభించాలని అబుధాబి నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే..కోవిడ్ నేపథ్యంలో విద్యార్ధుల భద్రతకు తగిన ప్రమాణాలతో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఎడ్యూకేషన్&నాలెడ్జ్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. ఫిజికల్ డిస్టెన్స్ కోసం క్లాసు రూంలలో ప్రతి విద్యార్ధికి మధ్య మీటర్ ఎడం ఉండేలా సీటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఇందుకోసం అదనపు తరగతి గదులను కూడా సిద్ధం చేస్తున్నారు. స్కూల్ గ్రౌండ్, క్యాంటిన్, ఇతర కామన్ ఏరియాల్లోనూ ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా చర్యలు తీసుకుంటామన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు, ఇతర కారణాలతో వ్యాక్సిన్ తీసుకోని వారికి ఆన్ లైన్ క్లాసెస్ ఆప్షన్ కూడా ఉందన్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







