టీటీడీ ఆసుపత్రుల్లో జనరిక్ మందుల వాడకం పెంచాలి: ఈవో జవహర్ రెడ్డి
- August 03, 2021
తిరుపతి: తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో మంగళవారం సాయంత్రం ఆయన మందులు, వైద్య పరికరాల కొనుగోలు విధానం పై సమీక్ష నిర్వహించారు.
స్విమ్స్ లో మందులు, పరికరాల కొనుగోలు కోసం టెండర్లు నిర్వహిస్తున్న విధానం తెలుసుకున్నారు. టెండర్ కాల పరిమితి పూర్తి కావడానికి నాలుగు నెలల ముందు నుంచే మళ్లీ టెండర్లు ఆహ్వానించే కసరత్తు ప్రారంభించాలన్నారు. ఏమందులు కావాలో ప్రతిపాదనలు పంపే అధికారులు వాటి నాణ్యత నిర్ధారించే కమిటీలో ఉండకూడదని చెప్పారు. ప్రభుత్వ డ్రగ్ కంట్రోల్ విభాగం నుంచి ఈ కమిటీలో ఒకరిని ఏర్పాటు చేసుకోవాలని ఈవో సూచించారు. రెండేళ్లకు సరిపడే మందులు ఒకే సారి కొనుగోలు చేసుకుకోవాలని ఇందుకోసం నిమ్స్, నింహ్యాన్స్ ఆసుపత్రులు అవలంభిస్తున్న విధానం అమలు చేసుకోవాలని ఈవో చెప్పారు. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ లో మందులు ఏ ధరకు సరఫరా చేసున్నారో కూడా తెలుసుకోవాలని అన్నారు.
అదనపు ఈవో ధర్మారెడ్డి, జెఈవో సదా భార్గవి, ఎఫ్ ఏ అండ్ సీఏఓ బాలాజి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, బర్ద్ ఆర్ఎమ్ఓ శేష శైలేంద్ర, స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, టీటీడీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మురళీధర్, స్విమ్స్ కొనుగోలు విభాగం అధికారులు డాక్టర్ వెంకటరామిరెడ్డి, డాక్టర్ ఎర్రమ రెడ్డి పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







