వాది విషాదం..ఈతకు వెళ్లి బాలుడి మృతి

- August 04, 2021 , by Maagulf
వాది విషాదం..ఈతకు వెళ్లి బాలుడి మృతి

ఒమన్: ఒమన్ లోని సోహర్ విలాయత్ పరిధిలోని వాదిలో విషాదం చోటు చేసుకుంది. ఈత కోసం వెళ్లిన 13 ఏళ్ల బాలుడి నీటిలో మునిగి మృతి చెందాడు. ఉత్తర అల్ బటినా గవర్నర్‌లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ..ప్రమాద సమాచారాన్ని అందుకోగానే ఘటనా స్థలానికి చేరుకుంది. బాలుడి కోసం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి అతని మృత దేహాన్ని వెలికి తీసింది. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు పిల్లల కదలికలను గమనిస్తూ ఉండాలని అధికారులు సూచించారు. ఈత కోసం కేటాయించని నీటి ప్రదేశాలకు పిల్లలను పంపించకూడాదని అధికారులు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com