బిగ్ టికెట్ అబుధాబి డ్రాలో జాక్‌పాట్ కొట్టిన భారతీయుడు

- August 04, 2021 , by Maagulf
బిగ్ టికెట్ అబుధాబి డ్రాలో జాక్‌పాట్ కొట్టిన భారతీయుడు

యూఏఈ: అబుధాబి బిగ్ టికెట్ రాఫెల్‌లో భారత వ్యక్తి జాక్‌పాట్ కొట్టాడు. మంగళవారం తీసిన ర్యాఫిల్ డ్రాలో సనూప్ సునీల్ అనే భారతీయుడు ఏకంగా 15 మిలియన్ దిర్హాములు  గెలచుకున్నాడు.జూలై 13న సునీల్ కొనుగోలు చేసిన లాటరీ టికెట్ నెం.183947కు ఈ జాక్‌పాట్ తగిలింది. కాగా, భారీ మొత్తం గెలుచుకున్న సునీల్‌కు లాటరీ నిర్వాహకులు ఫోన్ చేయగా అతడి నుంచి ఎలాంటి స్పందన రాలేదట. రిచర్డ్ అనే బిగ్ టికెట్‌కు చెందిన వ్యక్తి పలుమార్లు సునీల్ మొబైల్‌కు కాల్ చేశారు. కానీ, అవతలి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదని రిచర్డ్ తెలిపారు. దాంతో నిర్వాహకులు సునీల్‌కు ఈ విషయాన్ని తెలియజేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇక ఇదే లాటరీలో అబుధాబికి చెందిన జాన్సన్ కుంజుకుంజు అనే వ్యక్తి రెండో బహుమతి రూపంలో 1 మిలియన్ దిర్హాములు గెలుచుకున్నాడు.జూలై 16న జాన్సన్ కొన్న లాటరీ టికెట్ నెం.122225కు ఈ భారీ మొత్తం తగిలింది.

--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com