ఖతార్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ గా తెలుగు విద్యావేత్త
- August 04, 2021
దోహా: భారత సాంస్కృతిక కేంద్రం, ఖతార్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ గా తెలుగు విద్యావేత్త KS ప్రసాద్ నియమితులయ్యారు.ఈ మేరకు భారత రాయబార కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది.
దాదాపు 40 ఏళ్లు గా గల్ఫ్ దేశాల్లో తెలుగు వారి సాంస్కృతిక, భాషా పరిరక్షణ కు మాత్రమే కాకుండా వివిధ సాంఘిక, సంక్షేమ, క్రీడాభివృద్దికి నిరంతరం ఎనలేని కృషి,తోడ్పాటు అందిస్తున్న కోడూరు శివరాం ప్రసాద్ ని ఖతార్ లోని ప్రతిష్టాత్మక భారత సంస్కృతిక కేంద్రానికి అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ గా ఖతార్ లోని భారత రాయబార కార్యాలయం నియమించింది.
కోడూరు శివరాం ప్రసాద్ ఒక తెలుగు ఎన్నారై గా తెలుగు భాషా, సంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే దిశగా ఎన్నో ఏళ్లుగా తెలుగు కళా సమితి నీ స్థాపించి తెలుగు సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచం నలుమూలల చాటి చెప్పేలా అద్భుతమైన కార్యక్రమాలకు చేయడమే కాకుండా మరెన్నో తెలుగు సంఘాలకు సలహాదారులుగా, సభ్యుడి గా తోడ్పాటు అందించారు.
కేవలం సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా ఎన్నో సాంఘిక,సంక్షేమ కార్య్రమాలకు కూడా తన వంతు కృషి చేశారు.గత సంవత్సరం కరోనా కాలంలో లాక్ డౌన్ లో ఇటలీ, ఖతార్ లో చిక్కుకు పోయిన భారతీయులను తమ గమ్య స్థానాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు, దీనికి గుర్తింపు గా ఇండియన్ కమ్యూనిటీ బెనవలెంట్ ఫోరమ్ ఖతార్ వారు 2020 లో లాంగ్ టర్మ్ కమ్యూనిటీ సర్వీసెస్ లీడర్ గా ప్రత్యేక అవార్డ్ తో సత్కరించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







