ఖతార్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ గా తెలుగు విద్యావేత్త
- August 04, 2021
దోహా: భారత సాంస్కృతిక కేంద్రం, ఖతార్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ గా తెలుగు విద్యావేత్త KS ప్రసాద్ నియమితులయ్యారు.ఈ మేరకు భారత రాయబార కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది.
దాదాపు 40 ఏళ్లు గా గల్ఫ్ దేశాల్లో తెలుగు వారి సాంస్కృతిక, భాషా పరిరక్షణ కు మాత్రమే కాకుండా వివిధ సాంఘిక, సంక్షేమ, క్రీడాభివృద్దికి నిరంతరం ఎనలేని కృషి,తోడ్పాటు అందిస్తున్న కోడూరు శివరాం ప్రసాద్ ని ఖతార్ లోని ప్రతిష్టాత్మక భారత సంస్కృతిక కేంద్రానికి అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ గా ఖతార్ లోని భారత రాయబార కార్యాలయం నియమించింది.
కోడూరు శివరాం ప్రసాద్ ఒక తెలుగు ఎన్నారై గా తెలుగు భాషా, సంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే దిశగా ఎన్నో ఏళ్లుగా తెలుగు కళా సమితి నీ స్థాపించి తెలుగు సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచం నలుమూలల చాటి చెప్పేలా అద్భుతమైన కార్యక్రమాలకు చేయడమే కాకుండా మరెన్నో తెలుగు సంఘాలకు సలహాదారులుగా, సభ్యుడి గా తోడ్పాటు అందించారు.
కేవలం సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా ఎన్నో సాంఘిక,సంక్షేమ కార్య్రమాలకు కూడా తన వంతు కృషి చేశారు.గత సంవత్సరం కరోనా కాలంలో లాక్ డౌన్ లో ఇటలీ, ఖతార్ లో చిక్కుకు పోయిన భారతీయులను తమ గమ్య స్థానాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు, దీనికి గుర్తింపు గా ఇండియన్ కమ్యూనిటీ బెనవలెంట్ ఫోరమ్ ఖతార్ వారు 2020 లో లాంగ్ టర్మ్ కమ్యూనిటీ సర్వీసెస్ లీడర్ గా ప్రత్యేక అవార్డ్ తో సత్కరించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ విజేతలు..9వేల మంది విజేతలు..!!
- అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని ఖతార్ పిలుపు..!!
- నువైసీబ్ బార్డర్ క్రాసింగ్ను సందర్శించిన ప్రధానమంత్రి..!!
- సౌదీలో వారంలో 15,339 మంది అరెస్టు..!!
- ఒమన్ లో ఫైర్ వర్క్స్ కు వ్యతిరేకంగా హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్, సౌదీలో ఏప్రిల్ ఫార్ములా 1 రేసులు రద్దు..!!
- సజా ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం..!!
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!









