మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న ఇరువురు చైనా మహిళలకు ఐదేళ్లు జైలుశిక్ష
- March 13, 2016
ఇరువురు చైనా మహిళలు బహెరిన్ లో ఒక రహస్య ఏజెంట్ కు షబు విక్రయించిన నేరంలో ఐదేళ్లు కారాగారముతో పాటు 3,000 దినార్ల జరిమానాగా విధించారు. అంతర్గత మంత్రిత్వ వ్యతిరేక మాదక శాఖ ఒక చిట్కాను ప్రయోగించింది. తొలుత వారిని సంప్రదింఛిన ఓ అధికారి తమకు ఆ మాదక ద్రవ్యం కావాలని నమ్మకంగా చైనా మహిళలను కోరారు. ఆ షబును అంధ చేస్తే 1000 దినార్ల ను ఇస్తానని వారికి ఆశ చూపడంతో వారు జుఫ్ఫిర్ ప్రాంతంలో కలవటానికి అంగీకరించారు. వీరి కోసం సిద్ధంగా ఉన్న పోలీస్ అధికారులు అకస్మాతుగా మాదక ద్రవ్యం అందచేసే సమయానికి దాడి చేసి వారిని అరెస్టు చేసి అదుపులోనికి తీసుకొన్నారు. వారు ఇచ్చిన వివరాల ప్రకారం మరో మహిళ కోసం వారి అపార్ట్మెంట్ పై దాడి చేసారు, అక్కడ ఉన్న మహిళ అసాధారణ స్థితిలో ఉంది. మాదకద్రవ్య పరీక్షలో ఆమె విఫలమైంది. కాని వీరితో కలిసి ఒకే చోట ఉంటున్నందుకు మూడవ మహిళకు ఆరు నెలల జైలు శిక్ష విధించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









