మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న ఇరువురు చైనా మహిళలకు ఐదేళ్లు జైలుశిక్ష
- March 13, 2016
ఇరువురు చైనా మహిళలు బహెరిన్ లో ఒక రహస్య ఏజెంట్ కు షబు విక్రయించిన నేరంలో ఐదేళ్లు కారాగారముతో పాటు 3,000 దినార్ల జరిమానాగా విధించారు. అంతర్గత మంత్రిత్వ వ్యతిరేక మాదక శాఖ ఒక చిట్కాను ప్రయోగించింది. తొలుత వారిని సంప్రదింఛిన ఓ అధికారి తమకు ఆ మాదక ద్రవ్యం కావాలని నమ్మకంగా చైనా మహిళలను కోరారు. ఆ షబును అంధ చేస్తే 1000 దినార్ల ను ఇస్తానని వారికి ఆశ చూపడంతో వారు జుఫ్ఫిర్ ప్రాంతంలో కలవటానికి అంగీకరించారు. వీరి కోసం సిద్ధంగా ఉన్న పోలీస్ అధికారులు అకస్మాతుగా మాదక ద్రవ్యం అందచేసే సమయానికి దాడి చేసి వారిని అరెస్టు చేసి అదుపులోనికి తీసుకొన్నారు. వారు ఇచ్చిన వివరాల ప్రకారం మరో మహిళ కోసం వారి అపార్ట్మెంట్ పై దాడి చేసారు, అక్కడ ఉన్న మహిళ అసాధారణ స్థితిలో ఉంది. మాదకద్రవ్య పరీక్షలో ఆమె విఫలమైంది. కాని వీరితో కలిసి ఒకే చోట ఉంటున్నందుకు మూడవ మహిళకు ఆరు నెలల జైలు శిక్ష విధించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







