17 మంది ఉగ్రవాదులు మృతి : యెమెన్
- March 13, 2016
యెమెన్లోని అడెన్ సమీపంలో గల అల్ మన్సురా జిల్లాలో శనివారం అర్ధరాత్రి జరిగిన వైమానిక దాడుల్లో 17 మంది అనుమానిత అల్ఖైదా ఉగ్రవాదులు మృతి చెందారు. ఈ విషయాన్ని భద్రతాధికారులు ధ్రువీకరించారు. ఈ దాడిలో 20 మంది ఉగ్రవాదులతో సహా ముగ్గురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. హౌతి ఉగ్రవాదుల ఆధీనంలో ఉన్న అడెన్ నగరాన్ని గతేడాది జులైలో సౌదీ మిత్రపక్షాలు తిరిగి ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. అప్పటి నుంచి అక్కడి భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు దాడులు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ఉగ్రవాదులపై వైమానిక దాడులు జరిపినట్లు భద్రతా అధికారులు తెలిపారు
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







