ట్రావెల్ బ్యాన్ దేశాల ప్రవాసీయులకు సెప్టెంబర్ వరకు వీసా గడువు పెంపు
- August 18, 2021
సౌదీ: ట్రావెల్ బ్యాన్ ఎదుర్కొంటున్న దేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాసీయులు, పర్యాటకులకు వీసా గడువు పొడిగించింది సౌదీ ప్రభుత్వం. రెసిడెన్సీ పర్మిట్(ఇకామాస్), ఎగ్జిట్& రీ-ఎంట్రీ వీసాలు, అలాగే ప్రయాణ నిషేధాన్ని ఎదుర్కొంటున్న దేశాలలో ప్రస్తుతం చిక్కుకున్న ప్రవాసుల విజిట్ వీసాలను సెప్టెంబర్ 30, 2021 వరకు ఉచితంగా పొడిగిస్తున్నట్లు సౌదీ స్పష్టం చేసింది. పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ ఆదేశాల మేరకు ఆర్థిక మంత్రి మంజూరు చేసిన ఇకామాలు, వీసాల చెల్లుబాటు వ్యవధిని ఉచితంగా పొడిగిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. జాతీయ సమాచార కేంద్రం సహకారంతో వీసా గడువు పెంపు ఆటోమెటిగ్గా జరిగిపోతుందని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్లు (జవాజత్) తెలిపింది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









