ట్రావెల్ బ్యాన్ దేశాల ప్రవాసీయులకు సెప్టెంబర్ వరకు వీసా గడువు పెంపు
- August 18, 2021
సౌదీ: ట్రావెల్ బ్యాన్ ఎదుర్కొంటున్న దేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాసీయులు, పర్యాటకులకు వీసా గడువు పొడిగించింది సౌదీ ప్రభుత్వం. రెసిడెన్సీ పర్మిట్(ఇకామాస్), ఎగ్జిట్& రీ-ఎంట్రీ వీసాలు, అలాగే ప్రయాణ నిషేధాన్ని ఎదుర్కొంటున్న దేశాలలో ప్రస్తుతం చిక్కుకున్న ప్రవాసుల విజిట్ వీసాలను సెప్టెంబర్ 30, 2021 వరకు ఉచితంగా పొడిగిస్తున్నట్లు సౌదీ స్పష్టం చేసింది. పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ ఆదేశాల మేరకు ఆర్థిక మంత్రి మంజూరు చేసిన ఇకామాలు, వీసాల చెల్లుబాటు వ్యవధిని ఉచితంగా పొడిగిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. జాతీయ సమాచార కేంద్రం సహకారంతో వీసా గడువు పెంపు ఆటోమెటిగ్గా జరిగిపోతుందని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్లు (జవాజత్) తెలిపింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







