'తోఇఫా దుబాయ్ 2016' లో సందడి చేయనున్న బాలీవుడ్ తారలు
- March 13, 2016
దుబాయ్ లో ప్రముఖ హింది సినిమా తారలు తమ ఆటపాటలతో త్వరలో సందడి చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తోఇఫా దుబాయ్ 2016 పేరిట అతిపెద్ద ఉత్సవం జరగనుంది. భారీ బాలీవుడ్ తారా ప్రముఖులు షా రుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణ్వీర్ సింగ్, కరీనా కపూర్ ఖాన్, వరుణ్ ధావన్ , జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రితీష్ దేశ్ముఖ్ తదితరులతో పాటు 100 మంది కంటే ఎక్కువ మంది బాలీవుడ్ ప్రముఖులు తమ ఉనికిని ఇక్కడ చాటనున్నారు. తోఇఫా దుబాయ్ 2016 కూటమిలో బాలీవుడ్ విశ్వవిఖ్యాత అగ్ర నటుడు, నట చిహ్నం అమితాబ్ బచ్చన్ హాజరై తోఇఫా కు ప్రత్యేక అదనపు ఆకర్షణ కానున్నారు. నాణ్యతకు కమిటీ. ఈ సందర్భంగా తోఇఫా అతి ముఖ్యమైన వ్యక్తులకు మూడు స్థాయిలలో అనువైన పాకేజీలు అందిస్తోంది. తోఇఫా ఏర్పాటుతో బాలీవుడ్ తారా ప్రముఖులకు సమీపంలో కూర్చొని ఈ కార్యక్రమాలను తిలకించే అనుభూతిని పొందవచ్చు. అలాగే వారితో సంభాషించే అవకాశం అందరికి ఇవ్వాలని నిర్వాహకులు ఈ పాకేజీలు రూపకల్పన చేశారు .
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







