గాంధీ ఆసుపత్రి, సంతోష్ నగర్ రేప్ కేసులు వట్టివే..!
- August 19, 2021
హైదరాబాద్: హైదరాబాద్లో సంచలనం సృష్టించిన రెండు గ్యాంగ్ రేప్ కేసులను పోలీసులు ఛేదించారు.గాంధీ ఆస్పత్రి, సంతోష్నగర్ గ్యాంగ్ రేపులు జరగలేదని పోలీసులు తేల్చారు. గ్యాంగ్ రేప్లు జరగకపోయినా యువతులు కట్టుకథలు అల్లినట్లు పేర్కొన్నారు.గాంధీ ఆస్పత్రిలో యువతిపై గ్యాంగ్ రేప్ జరగలేదని.. అక్కా చెల్లెల్లిద్దరికీ కల్లు తాగే అలవాటు ఉందని పేర్కొన్నారు.ఇక కల్లు తాగి చెల్లి అపస్మారక స్థితిలోకి వెళ్లిదని.. ఆ విషయాన్ని దాచిపెట్టేందుకే అక్క గ్యాంగ్ రేప్ డ్రామా ఆడిందని పేర్కొన్నారు.మరోవైపు యువతుల మానసిక స్థితి సరిగాలేదని తేల్చి చెప్పారు పోలీసులు.. మరోవైపు సంతోష్నగర్ గ్యాంగ్ రేప్ పూర్తిగా అభూతకల్పన పోలీసులు తేల్చారు. ప్రియుడి పెళ్లిచేసుకోనని చెప్పడంతో అతడిని కేసులో ఇరికించేందుకు.. ప్లాన్ వేయిన యువతి. తనని ముగ్గురు ఆటో డ్రైవర్లు రేప్ చేశారంటూ స్టోరీ అల్లినట్లు తేల్చారు. రాత్రంతా చాంద్రాయణగుట్టలో తిరిగి రేప్ కథ చెప్పినట్లు గుర్తించారు. పోలీసుల విచారణలో యువతి చెప్పింది కట్టుకథగా తేలిందని నిర్థరణ అయ్యింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







