అనుకూలంగా వార్షిక బడ్జె : ఈటెల రాజేందర్‌

- March 13, 2016 , by Maagulf
అనుకూలంగా వార్షిక బడ్జె : ఈటెల రాజేందర్‌

అన్ని వర్గాలకు అనుకూలంగా వార్షిక బడ్జెట్‌ ఉంటుందని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. ఈ రోజు బడ్జెట్‌ సందర్భంగా ఆయన అసెంబ్లికి బయలుదేరారు. అసెంబ్లికి వెళ్లే ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ సభలో లక్షా 30వేల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఆదాయం, ఖర్చులను బేరీజు వేసుకున్న తర్వాతే ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్ర బడ్జెట్‌ ఉంటుందని అన్నారు.కన్నీళ్లు, కష్టాలు లేని రాష్ట్రంగా తెలంగాణ చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశంలోనే తెలంగాణ గొప్ప రాష్ట్రంగా కాబోతోందన్నారు. మరిన్నీ సంక్షేమ పథకాలు అమలు చేసే విధంగా ముందుకువెళ్తున్నామని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com