దేశం మొత్తం 30 వేలు.. కేరళలోనే19 వేల కరోనా కేసులు!
- August 31, 2021
దిల్లీ: గత కొంతకాలంగా కరోనా వ్యాప్తిలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. 30 నుంచి 40వేల చేరువగానే కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా రోజువారీ కేసులు భారీగా తగ్గాయి. ముందురోజుతో పోల్చితే 27.9 శాతం మేర క్షీణించాయి. మృతుల సంఖ్యలో కూడా తగ్గుదల కనిపించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలను వెలువరించింది.
తాజాగా 13,94,573 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 30,941 మందికి పాజిటివ్గా తేలింది. తగ్గిన పరీక్షల సంఖ్య కూడా కేసుల్లో తగ్గుదలకు కారణంగా కనిపిస్తోంది. ఇక ఒక్క కేరళలోనే 19వేల కేసులు వెలుగుచూశాయి. ఈ లెక్కన దేశంలో మిగిలిన ప్రాంతాల్లో మొత్తం 11 వేలు నమోదకాగా.. కేరళలో 19 వేల కేసులు బయటపడటం అక్కడి పరిస్థితి తీవ్రతను వెల్లడిచేస్తోంది. నిన్న 350 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ప్రస్తుతం 3,70,640 మంది కొవిడ్తో బాధపడుతుండగా.. 24 గంటల వ్యవధిలో 36,275 మంది కోలుకున్నారు. క్రియాశీల కేసుల రేటు 1.13 శాతానికి చేరగా.. రికవరీ రేటు 97.53 శాతంగా ఉంది.
గతేడాది కరోనా మహమ్మారి దేశంలో అడుగుపెట్టిన దగ్గరి నుంచి 3.27 కోట్ల మందికి పాజిటివ్గా తేలింది. 3.19 కోట్ల మంది వైరస్ను జయించారు. 4,38,560 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోపక్క నిన్న 59,62,286 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటి వరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 64 కోట్ల మార్కును దాటినట్లు కేంద్రం తెలిపింది.
తాజా వార్తలు
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- భారతదేశంలోని 9 నగరాలకు జజీరా విమాన సర్వీసుల తాత్కాలిక రద్దు
- అనంతపురాన్ని సేవతో మార్చిన ఫాదర్ విన్సెంట్ ఫెరర్ జయంతి నేడు
- విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు.. ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు..
- లూలు మాల్కు భూకేటాయింపు రద్దు









