దుబాయ్ నుంచి అబుదాబీకి 15 నిమిషాల్లోనే
- March 14, 2016
రవాణా రంగంలో హైపర్లూప్ సరికొత్త సంచలనాలకు సిద్ధమవుతోందని యూఏఈ ఫెడరల్ రటాన్స్పోర్ట్ అథారిటీ - ల్యాండ్ అండ్ మెరిటైమ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అబ్దుల్లా ఎస్ అల్ కతీరి చెప్పారు. హైపర్ లూప్ ద్వారా గంటకు 1,100 కిలోమీటర్ల వేగంతో కార్గో మరియు ప్రయాణీకుల్ని గమ్యస్థానాలకు చేర్చవచ్చునని హైపర్ లూప్ టెక్నాలజీస్ ప్రతినిథులు వెల్లడించారు. హై స్పీడ్ రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్తో పోల్చితే ఖర్చు కూడా 62 శాతం తక్కువే అవుతుందని వారు చెప్పారు. యూఏఈ, దుబాయ్ తొలిసారిగా హైపర్లూప్ టెక్నాలజీని వినియోగించుకోవడం ద్వారా చరిత్రకెక్కే అవకాశం ఉందని వారు వివరించారు. హైపర్ లూప్ టెక్నాలజీస్ తమ ప్రాజెక్ట్ని వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్లో ప్రొజెక్ట్ చేయడం జరిగింది. లాస్ వెగాస్లో ఈ ఏడాది దీన్ని పరీక్షించనున్నారు. యూఏఈలో 10 నుంచి 15 ఏళ్ళలోపే ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చనుందని హైపర్లూప్ వెల్లడించింది. హైపర్ లూప్ ద్వారా కేవలం 15 నిమిషాల్లోనే దుబాయ్ నుంచి అబుదాబీకి చేరుకోవడం వీలవుతుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







