గణేష్ బందోబస్తు పై సైబరాబాద్ సీపీ సమీక్ష సమావేశం
- September 02, 2021
హైదరాబాద్: రానున్న గణేష్ పండుగను పురస్కరించుకొని గణేష్ బందోబస్తు ఏర్పాట్లపై సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, బాలానగర్, మాదాపూర్, శంషాబాద్ జోన్ ల డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీ లు, ఇన్ స్పెక్టర్లతో, ట్రాఫిక్ , సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ సిబ్బంది, ఎస్ఓటీ తదితర అధికారులతో ఈరోజు సీపీ ఆఫీసులో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ..వినాయక నిమజ్జనం ప్రశాంతమైన వాతవరణంలో జరగాలన్నారు.ఇందులో భాగంగా పోలీసు అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
నిమజ్జనానికి వచ్చే వారితో మర్యాదగా ఉండాలని, శాంతి భద్రతల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.ఇన్ స్పెక్టర్లు అన్ని శాఖలతో, హైదరాబాద్ ఎం పోలీసులతో సమన్వయం చేసుకుని పని చేయాలన్నారు.డయల్ 100 కు వచ్చే కాల్స్ ను ప్రత్యేక శ్రద్ధతో పరిగణించాలన్నారు.సీసీటీవీ ల పై దృష్టి సారించాలన్నారు.విజిబుల్ పోలీసింగ్ కు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర డీసీపీ ట్రాఫిక్ ఎస్ఎమ్ విజయ్ కుమార్,డీసీపీ బాలానగర్ పీవీ పద్మజా, డీసీపీ మాదాపూర్ వెంకటేశ్వర్లు, ఎస్ఓటీ డీసీపీ సందీప్, ఏడీసీపీలు, ఏసీపీలు, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..
- చికాగోలో NATS అడాప్ట్ ఎ హైవే కు మంచి స్పందన
- షార్జా యూనివర్సిటీ ఆసుపత్రి విస్తరణకు AED 300 మిలియన్ల మంజూరు
- ‘దుబాయ్-ఇట్’ వ్యూహాన్ని ఆవిష్కరించిన షేక్ మొహమ్మద్
- కృష్ణలంక ఘటన పై ఏపీ ప్రభుత్వం సీరియస్..
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు









