ఒమన్ కి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ 19 బీమా తప్పనిసరి
- September 03, 2021ఒమన్: సుల్తానేట్ కి వచ్చే ప్రయాణికులకు ఖచ్చితంగా కోవిడ్ 19 బీమా ఉండాలని ఒమన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సుల్తానేట్ కు విమాన సర్వీసులు నడిపే అన్ని ఎయిర్ లైన్స్ సంస్థలకు సివిల్ ఏవియేషన్ అథారిటీ (CAA) ఉత్తర్వులు జారీ చేసింది. కనీసం నెల రోజుల పాటు ఆస్పత్రి ఖర్చులు కవర్ అయ్యేలా అంతర్జాతీయ బీమా ఉండాలని సర్క్యులర్లో స్పష్టం చేసింది. ఇప్పటికే వ్యక్తిగత బీమా ఉన్నవారు, కంపెనీల నుంచి బీమా పొందిన వారు కొత్తగా ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ, ప్రయాణానికి ముందు తమ బీమా డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. అయితే..ఒమనీ పౌరులకు బీమా నిబంధనలు వర్తించవు. ఇదిలాఉంటే సెప్టెంబర్ 1 నుంచి ట్రావెల్ బ్యాన్ ఎత్తివేత అమలులోకి రావటంతో వివిధ దేశాల నుంచి సుల్తానేట్ కు వస్తున్న ప్రయాణికుల సంఖ్య పెరిగింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు