ఒమన్ కి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ 19 బీమా తప్పనిసరి
- September 03, 2021
ఒమన్: సుల్తానేట్ కి వచ్చే ప్రయాణికులకు ఖచ్చితంగా కోవిడ్ 19 బీమా ఉండాలని ఒమన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సుల్తానేట్ కు విమాన సర్వీసులు నడిపే అన్ని ఎయిర్ లైన్స్ సంస్థలకు సివిల్ ఏవియేషన్ అథారిటీ (CAA) ఉత్తర్వులు జారీ చేసింది. కనీసం నెల రోజుల పాటు ఆస్పత్రి ఖర్చులు కవర్ అయ్యేలా అంతర్జాతీయ బీమా ఉండాలని సర్క్యులర్లో స్పష్టం చేసింది. ఇప్పటికే వ్యక్తిగత బీమా ఉన్నవారు, కంపెనీల నుంచి బీమా పొందిన వారు కొత్తగా ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ, ప్రయాణానికి ముందు తమ బీమా డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. అయితే..ఒమనీ పౌరులకు బీమా నిబంధనలు వర్తించవు. ఇదిలాఉంటే సెప్టెంబర్ 1 నుంచి ట్రావెల్ బ్యాన్ ఎత్తివేత అమలులోకి రావటంతో వివిధ దేశాల నుంచి సుల్తానేట్ కు వస్తున్న ప్రయాణికుల సంఖ్య పెరిగింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







