ఒమన్ కి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ 19 బీమా తప్పనిసరి
- September 03, 2021
ఒమన్: సుల్తానేట్ కి వచ్చే ప్రయాణికులకు ఖచ్చితంగా కోవిడ్ 19 బీమా ఉండాలని ఒమన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సుల్తానేట్ కు విమాన సర్వీసులు నడిపే అన్ని ఎయిర్ లైన్స్ సంస్థలకు సివిల్ ఏవియేషన్ అథారిటీ (CAA) ఉత్తర్వులు జారీ చేసింది. కనీసం నెల రోజుల పాటు ఆస్పత్రి ఖర్చులు కవర్ అయ్యేలా అంతర్జాతీయ బీమా ఉండాలని సర్క్యులర్లో స్పష్టం చేసింది. ఇప్పటికే వ్యక్తిగత బీమా ఉన్నవారు, కంపెనీల నుంచి బీమా పొందిన వారు కొత్తగా ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ, ప్రయాణానికి ముందు తమ బీమా డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. అయితే..ఒమనీ పౌరులకు బీమా నిబంధనలు వర్తించవు. ఇదిలాఉంటే సెప్టెంబర్ 1 నుంచి ట్రావెల్ బ్యాన్ ఎత్తివేత అమలులోకి రావటంతో వివిధ దేశాల నుంచి సుల్తానేట్ కు వస్తున్న ప్రయాణికుల సంఖ్య పెరిగింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- 14 లక్షల మంది రైతులకు రూ.75,000 రుణమాఫీ!
- అపోలో హెల్త్టెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్గా శోభన కామినేని
- ఖతార్ లో రెండవ సెమిస్టర్ ఫలితాలు విడుదల..!!
- దుబాయ్ లో క్రికెట్ ఆడుతూ కర్ణాటక వాసి మృతి..ఘనంగా నివాళులు..!!
- షార్జా బ్యాంక్ మిలియనీర్ క్యాంపెయిన్..Dh2 మిలియన్లు గెలిచిన భారత ప్రవాసి..!!
- మక్కాలో పవిత్ర కాబాను కొత్త 'కిస్వా'తో అలంకరణ..!!
- ఆర్థిక ఉపశమన ప్యాకేజీని ప్రకటించిన ఒమన్..!!
- T4 టెర్మినల్ నుంచి ఒకే ఫారీన్ ఫ్లైట్ కు అనుమతి..!!
- తల్లి ఇంటికి నిప్పు పెట్టిన వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష..!!
- 22 మంది చిన్నారుల మృతి.. ‘దగ్గు సిరప్’ల పై కేంద్రం కీలక నిర్ణయం..









