పాకిస్థాన్‌ జైళ్లలో 362 మంది భారత జాలర్లు బందీలుగా

- March 15, 2016 , by Maagulf
పాకిస్థాన్‌ జైళ్లలో 362 మంది భారత జాలర్లు బందీలుగా

పాకిస్థాన్‌ జైళ్లలో 362 మంది భారత జాలర్లు బందీలుగా ఉన్నారు. వీరిలో గుజరాత్‌కు చెందిన వారే ఎక్కువమంది ఉన్నారని ఆ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి అసెంబ్లీలో చెప్పారు. కాంగ్రెస్‌కు చెందిన పంజాభాయ్‌ వాన్ష్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి బాబు బొకిరియా ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ఇప్పటివరకు పాక్‌ జైళ్లలో 448 మంది ఉన్నారని.. మార్చి 21న 86 మంది జాలర్లు విడుదల కానున్నారని చెప్పారు. 2004 నుంచి 2014 మధ్య కాలంలో భారత జాలర్లకు చెందిన 702 బోట్లను పాకిస్థాన్‌ స్వాధీనం చేసుకుందని ఆయన పేర్కొన్నారు.గత రెండేళ్లలో 124 బోట్లను పాక్‌ స్వాధీనం చేసుకోగా వాటిలో 57 బోట్లను తిరిగి అప్పగించిందని, మరో 22 బోట్లను త్వరలోనే వెనక్కి ఇస్తుందని బొకిరియా వివరించారు.అక్కడి జైళ్లలో ఓ వ్యక్తి పక్షవాతంతో బాధపడుతున్నారని, మరో వ్యక్తి కోమాలో ఉన్నారని.. వారిని వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించి చికిత్స అందించాలని కాంగ్రెస్‌ సభ్యుడు పంజాభాయ్‌ కోరారు. గతంలో ఇద్దరు జాలర్లు జైల్లోనే మృతి చెందారని విషయాన్ని ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశామని.. త్వరలోనే మృతదేహాలను భారత్‌కు రప్పిస్తామని మంత్రి బొకిరియా వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com