తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- September 11, 2021
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కేసుల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో 69,833 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 296 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్ బారిన పడినవారి సంఖ్య 6,61,302కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శనివారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. నిన్న కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు వైరస్తో మరణించిన వారి సంఖ్య 3,893కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 322 మంది కోలుకున్నారు. ఇక, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 6,52,085కు చేరుకుంది. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 5,324 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 98.60 శాతానికి చేరిందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికా వర్క్ పర్మిట్ పొడిగింపు రద్దు
- ప్రసిద్ధ థాయ్ ఇన్హేలర్ రికాల్..!!
- వివిధ దేశాల నాయకులతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- వరల్డ్ సేఫేస్ట్ దేశాల జాబితాలో ఒమన్ కు స్థానం..!!
- సివిల్ ఐడిలో మార్పులు..ఐదుగురికి జైలు శిక్ష..!!
- బహ్రెయిన్లో తొమ్మిది దేశాల గర్జన..!!
- వడ్డీ రేట్లను తగ్గించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు







