భారత్ కరోనా అప్డేట్

- September 13, 2021 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా పాజిటివ్‌ రోజువారి కేసులు తగ్గుతూ వస్తున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 27,254 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. మరో 219 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇక, ఇదే సమయంలో 37,687 మంది బాధితులు కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కొలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం.. దీంతో.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,32,64,175 కు పెరగగా.. రికవరీ కేసులు 3,24,47,032కు పెరిగాయి. ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,74,269 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం. ఇక మరోవైపు.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కొనసాగుతుండగా.. ఇప్పటి వరకు 74,38,37,643 మందికి టీకా వేసినట్లు బులెటిన్‌లో పేర్కొంది కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com