మ్యాగీ కి బాయ్ చెప్పిన దుబాయ్
- June 05, 2015
భారతదేశంలో మ్యాగీ నూడిల్స్ విక్రయాలను పలు రాష్ట్రాలు నిషేధించడం తెలిసిందే. నెస్లె ఇండియా కంపెనీ యాజమాన్యం మ్యాగీ నూడుల్స్ ప్యాకెట్లను వెనక్కి తీసుకుంటున్నది. ఈ దెబ్బ రెండు రోజుల ముందు దుబాయ్లో పడింది. అక్కడ మ్యాగీ ప్యాకెట్లు విక్రయించరాదని ఫుడ్ కంట్రోల్ డిపార్ట్ మెంట్ గురువారం నోటీసులు ఇచ్చింది. అయితే మ్యాగీ కంపెనీ ఏజెంట్లు లేకపోవడంతో అక్కడి మాల్స్ యాజమాన్యం సరి కొత్త ప్లాన్ వేసింది. మ్యాగీ నూడుల్స్ ప్యాకెట్లను విక్రయించడానికి బంపర్ ఆఫర్లు పెట్టారు. ఇండియాలో తయారైన ఆరు ఫ్లేవర్స్ మ్యాగీ నూడుల్స్ కొన్ని నెలల క్రితం దుబాయ్ కి ఎగుమతి అయ్యాయి. ఇప్పుడు మ్యాగీ మీద నిషేదం విధించడంతో అక్కడి మాల్స్ లో క్లియరన్స్ సేల్స్ విభాగంలో మ్యాగీ నూడుల్స్ ప్యాకెట్లు పెట్టారు. అతి తక్కువ ధరకు విక్రయిస్తున్నామని బోర్డులు తగిలించారు. అధికారులు నిషేదం విధించినా మ్యాగీ ప్యాకెట్లను క్లియరెన్స్ సేల్స్ కింద విక్రయిస్తున్నారని దుబాయ్ లోని స్థానిక పత్రిక ఖలీజ్ టైమ్స్ బయటపెట్టింది. విషయం తెలుసుకున్న అధికారులు మాల్స్ లో సోదాలు చేసి మ్యాగీ ప్యాకెట్ లను స్వాధీనం చేసుకుంటున్నారు. మలేషియాలో తయారైన ఆరు మ్యాగీ ఫ్లేవర్స్ మాత్రమే విక్రయించాలని, భారత్ లో తయారైన మ్యాగీ ప్యాకెట్లు విక్రయించరాదని దుబాయ్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ దెబ్బతో దుబాయ్ లో సైతం మ్యాగీ కథ అయిపోయింది.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







