ఇక అభిమానుల మధ్య ఐపీఎల్..2వ ఫేజ్లో ఫ్యాన్స్ కి అనుమతి
- September 15, 2021
యూఏఈ: కోవిడ్ భయంతో ఇన్నాళ్లు ఫ్యాన్స్ లేక వెలవెలపోయిన స్టాండ్స్ ఇక సందడిగా మారబోతున్నాయి. వీవో ఐపీఎల్ 2021 కొత్త వేదికలు క్రికెట్ అభిమానులకు స్వాగతం పలికేందుకు సిద్ధం అవుతున్నాయి. ఈ నెల 19 నుంచి మొదలవనున్న ఐపీఎల్ సెకండ్ ఫేజ్ లో చెన్నై-ముంబై మధ్య జరిగే తొలి మ్యాచ్ కు దుబాయ్ వేదిక కానుంది. ఈ మ్యాచ్ కు ఫ్యాన్స్ హజరయ్యేందుకు యూఏఈ ప్రభుత్వం అనుమతించింది. డిఫెండెబుల్ ఛాంపియన్ హోదాలో బరిలోకి ముంబై హ్యాట్రిక్ ఐపీఎల్ టైటిల్ కోసం రేసులో నిలవగా..అపోనెంట్ చెన్నై టీం గతేడాది వైఫల్యాలను అదిమించేలా బ్రేక్ తర్వాతి చెలరేగిపోయేందుకు రెడీ అవుతున్నాయి.
ఐపీఎల్ మహా వినోదాన్ని ఆస్వాదించాలనుకుంటున్న అభిమానులు..ఇక కోవిడ్ అడ్డంకులతో బేజారవ్వాల్సిన అవసరం లేదు. సెప్టెంబర్ 16 నుంచి ఐపీఎల్ అధికారిక వెబ్సైట్ http://www.iplt20.comలో టికెట్లు కొనుగోలు చేయవచ్చు లేదా http://PlatinumList.netలో కూడా టిక్కెట్లను కొనుక్కోవచ్చు. అయితే..కోవిడ్ ప్రోటోకాల్, యూఏఈ ప్రభుత్వ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని పరిమిత సంఖ్యలోనే అభిమానులను అనుమతించనున్నారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







