300 దిర్హాముల ప్రత్యేక ఛార్జీలతో ఇండియాకి ఎయిర్ అరేబియా విమానాలు
- September 20, 2021
యూఏఈ: షార్జా కేంద్రంగా పనిచేస్తోన్న ఎయిర్ అరేబియా ఎయిర్ లైన్ సంస్థ, ఇండియాకి వెళ్ళే ప్రయాణీకుల కోసం స్పెషల్ ఆఫర్లను ప్రకటించింది. 300 దిర్హాముల నుంచి 600 దిర్హాముల మధ్య వన్ వే టిక్కెట్ ధరల వుండేలా 11 భారతీయ నగరాలకు కొత్త స్కీమ్ ప్రకటించారు. ఢిల్లీ, ముంబై, హైద్రాబాద్ మరియు కోచిలకు 300 దిర్హాములతో వెళ్ళవచ్చు. కాలికట్ మరియు చెన్నై నగరాలకు 310 దిర్హాములతో వెళ్ళవచ్చు. త్రివేండ్రమ్ 320 దిర్హాములతో, అహ్మదాబాద్ 350 దిర్హాములతో, కోయంబత్తూర్ 398 దిర్హాములతో, బెంగళూరు 450 దిర్హాములతో, గోవా 600 దిర్హాములతో వెళ్ళేందుకు వీలు కల్పిస్తున్నారు. కాగా, యూఏఈ వచ్చే ప్రయాణీకులు (ఇండియా, పాకిస్తాన్, నేపాల్ మరియు శ్రీలంక నుంచి ఇ వీసా ద్వారా వచ్చేవారు) కోవిడ్ 19 వ్యాక్సినేషన్ రికార్డులను (షార్జా మరియు రాస్ అల్ ఖైమాలకు ప్రయాణిస్తే) చూపించాల్సి వుంటుంది. ప్రయాణానికి ముందు ఐసీఏ ద్వారా రిజిస్టర్ అవ్వాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్-చెన్నై ఇక 2 గంటల్లోనే!
- కేతన్ అగర్వాల్ హత్య దర్యాప్తులో కొత్త విషయాలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!







