300 దిర్హాముల ప్రత్యేక ఛార్జీలతో ఇండియాకి ఎయిర్ అరేబియా విమానాలు
- September 20, 2021యూఏఈ: షార్జా కేంద్రంగా పనిచేస్తోన్న ఎయిర్ అరేబియా ఎయిర్ లైన్ సంస్థ, ఇండియాకి వెళ్ళే ప్రయాణీకుల కోసం స్పెషల్ ఆఫర్లను ప్రకటించింది. 300 దిర్హాముల నుంచి 600 దిర్హాముల మధ్య వన్ వే టిక్కెట్ ధరల వుండేలా 11 భారతీయ నగరాలకు కొత్త స్కీమ్ ప్రకటించారు. ఢిల్లీ, ముంబై, హైద్రాబాద్ మరియు కోచిలకు 300 దిర్హాములతో వెళ్ళవచ్చు. కాలికట్ మరియు చెన్నై నగరాలకు 310 దిర్హాములతో వెళ్ళవచ్చు. త్రివేండ్రమ్ 320 దిర్హాములతో, అహ్మదాబాద్ 350 దిర్హాములతో, కోయంబత్తూర్ 398 దిర్హాములతో, బెంగళూరు 450 దిర్హాములతో, గోవా 600 దిర్హాములతో వెళ్ళేందుకు వీలు కల్పిస్తున్నారు. కాగా, యూఏఈ వచ్చే ప్రయాణీకులు (ఇండియా, పాకిస్తాన్, నేపాల్ మరియు శ్రీలంక నుంచి ఇ వీసా ద్వారా వచ్చేవారు) కోవిడ్ 19 వ్యాక్సినేషన్ రికార్డులను (షార్జా మరియు రాస్ అల్ ఖైమాలకు ప్రయాణిస్తే) చూపించాల్సి వుంటుంది. ప్రయాణానికి ముందు ఐసీఏ ద్వారా రిజిస్టర్ అవ్వాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ