అబుదాబీలో ఘనంగా జరిగిన 'తెలంగాణ అవతరణ వేడుకలు'
- June 06, 2015
గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ మరియు తెలంగాణ జాగృతి సమర్పించు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అబుదాబీలో ఘనంగా జరిగాయి. శుక్రవారం (జూన్ 5) సాయంత్రం 5 గంటల నుంచి జరిగిన ఈ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కుమార్తె, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు అయిన కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అసోసియేషన్ సభ్యులు కవిత గారిని ఘనంగా సన్మానించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విదేశాల్లో టీఆర్ఎస్ శాఖలను ప్రారంభిస్తున్నామని చెప్పారు. గల్ఫ్లోని తెలంగాణ కార్మికులకూ బీమా సౌకర్యం కల్పించే ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచుతామన్నారు. తెలంగాణ కవి దేశపతి శ్రీనివాస్, మిమిక్రీ శ్రీనివాస్, సాయిచంద్, స్వర్ణక్క, పద్మావతి,నక్క భాస్కర్ రావు తదితరులు అబుదాబీలో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాలుపంచుకుని, ఆహూతుల్ని పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికి అధ్యక్షులు జువ్వాడి శ్రీనివాస రావు ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









