అబుదాబీలో ఘనంగా జరిగిన 'తెలంగాణ అవతరణ వేడుకలు'
- June 06, 2015
గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ మరియు తెలంగాణ జాగృతి సమర్పించు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అబుదాబీలో ఘనంగా జరిగాయి. శుక్రవారం (జూన్ 5) సాయంత్రం 5 గంటల నుంచి జరిగిన ఈ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కుమార్తె, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు అయిన కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అసోసియేషన్ సభ్యులు కవిత గారిని ఘనంగా సన్మానించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విదేశాల్లో టీఆర్ఎస్ శాఖలను ప్రారంభిస్తున్నామని చెప్పారు. గల్ఫ్లోని తెలంగాణ కార్మికులకూ బీమా సౌకర్యం కల్పించే ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచుతామన్నారు. తెలంగాణ కవి దేశపతి శ్రీనివాస్, మిమిక్రీ శ్రీనివాస్, సాయిచంద్, స్వర్ణక్క, పద్మావతి,నక్క భాస్కర్ రావు తదితరులు అబుదాబీలో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాలుపంచుకుని, ఆహూతుల్ని పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికి అధ్యక్షులు జువ్వాడి శ్రీనివాస రావు ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- రాంబిల్లిలో గ్రీన్ ఎనర్జీ విప్లవం
- ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ లీసా గిల్
- NATS ఆధ్వర్యంలో ‘హైవే దత్తత’ కార్యక్రమం
- కర్ణాటకలో విదేశీ మహిళ పై దాడి
- ప్రాంతీయ సంక్షోభాలను అంతం చేయడానికి దౌత్యమే ఏకైక మార్గం..!!
- యునెస్కో-సుల్తాన్ హైథమ్ బహుమతి..సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు గుర్తింపు..!!
- యూఏఈ లాటరీ: తాజా డ్రా విజేతల సంఖ్యలు.. ఎవరికీ దక్కని జాక్పాట్..!!
- 10 ఏళ్ల జైలు శిక్ష, 10 మిలియన్ల సౌదీ రియాల్స్ జరిమానా..!!
- 105,000 మంది కార్మికులకు 94 మిలియన్ల బహ్రెయిన్ దినార్ల మద్దతు..!!
- కార్మికుల సమావేశంపై పీఏఎం చర్యలు.. క్రిమినల్ దర్యాప్తునకు రిఫర్..!!









