అబుదాబీలో ఘనంగా జరిగిన 'తెలంగాణ అవతరణ వేడుకలు'
- June 06, 2015
గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ మరియు తెలంగాణ జాగృతి సమర్పించు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అబుదాబీలో ఘనంగా జరిగాయి. శుక్రవారం (జూన్ 5) సాయంత్రం 5 గంటల నుంచి జరిగిన ఈ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కుమార్తె, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు అయిన కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అసోసియేషన్ సభ్యులు కవిత గారిని ఘనంగా సన్మానించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విదేశాల్లో టీఆర్ఎస్ శాఖలను ప్రారంభిస్తున్నామని చెప్పారు. గల్ఫ్లోని తెలంగాణ కార్మికులకూ బీమా సౌకర్యం కల్పించే ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచుతామన్నారు. తెలంగాణ కవి దేశపతి శ్రీనివాస్, మిమిక్రీ శ్రీనివాస్, సాయిచంద్, స్వర్ణక్క, పద్మావతి,నక్క భాస్కర్ రావు తదితరులు అబుదాబీలో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాలుపంచుకుని, ఆహూతుల్ని పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికి అధ్యక్షులు జువ్వాడి శ్రీనివాస రావు ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







