ఈ నెల 12న విడుదల కానున్న 'జ్యోతిలక్ష్మీ'
- June 05, 2015
డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఛార్మి ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం 'జ్యోతిలక్ష్మీ'. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 12న విడుదలకు సిద్ధమౌతోంది. ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ..''మా జ్యోతిలక్ష్మీ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని 'యు/ఎ' సర్టిఫికెట్ పొందింది. సెన్సార్ పూర్తయిన అనంతరం సెన్సార్ సభ్యులు సినిమా చాలా బాగుందని ప్రశంసించారు. జూన్ 12న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. నిన్న రిలీజ్ అయిన ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఛార్మికి, పూరిజగన్నాథ్ గారికి 'జ్యోతిలక్ష్మీ' ఓ మెమరబుల్ మూవీ అవుతుంది'' అన్నారు. కౌర్ సమర్పణలో సి.కె.ఎంటర్టైన్మెంట్ ప్రై.లి., శ్రీశుభశ్వేత ఫిలిమ్స్ బ్యానర్పై తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఛార్మి, సత్య, వంశీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : సునీల్ కశ్యప్, ఎటిడింగ్ : ఎస్.ఆర్.శేఖర్, కెమెరా పి.జి.విందా, నిర్మాతలు : శ్వేతలానా, వరుణ్, తేజ, సి.వి.రావు, దర్శకత్వం పూరిజగన్నాథ్.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







