ఈ నెల 12న విడుదల కానున్న 'జ్యోతిలక్ష్మీ'
- June 05, 2015
డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఛార్మి ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం 'జ్యోతిలక్ష్మీ'. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 12న విడుదలకు సిద్ధమౌతోంది. ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ..''మా జ్యోతిలక్ష్మీ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని 'యు/ఎ' సర్టిఫికెట్ పొందింది. సెన్సార్ పూర్తయిన అనంతరం సెన్సార్ సభ్యులు సినిమా చాలా బాగుందని ప్రశంసించారు. జూన్ 12న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. నిన్న రిలీజ్ అయిన ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఛార్మికి, పూరిజగన్నాథ్ గారికి 'జ్యోతిలక్ష్మీ' ఓ మెమరబుల్ మూవీ అవుతుంది'' అన్నారు. కౌర్ సమర్పణలో సి.కె.ఎంటర్టైన్మెంట్ ప్రై.లి., శ్రీశుభశ్వేత ఫిలిమ్స్ బ్యానర్పై తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఛార్మి, సత్య, వంశీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : సునీల్ కశ్యప్, ఎటిడింగ్ : ఎస్.ఆర్.శేఖర్, కెమెరా పి.జి.విందా, నిర్మాతలు : శ్వేతలానా, వరుణ్, తేజ, సి.వి.రావు, దర్శకత్వం పూరిజగన్నాథ్.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









