ఈ నెల 12న విడుదల కానున్న 'జ్యోతిలక్ష్మీ'
- June 05, 2015
డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఛార్మి ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం 'జ్యోతిలక్ష్మీ'. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 12న విడుదలకు సిద్ధమౌతోంది. ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ..''మా జ్యోతిలక్ష్మీ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని 'యు/ఎ' సర్టిఫికెట్ పొందింది. సెన్సార్ పూర్తయిన అనంతరం సెన్సార్ సభ్యులు సినిమా చాలా బాగుందని ప్రశంసించారు. జూన్ 12న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. నిన్న రిలీజ్ అయిన ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఛార్మికి, పూరిజగన్నాథ్ గారికి 'జ్యోతిలక్ష్మీ' ఓ మెమరబుల్ మూవీ అవుతుంది'' అన్నారు. కౌర్ సమర్పణలో సి.కె.ఎంటర్టైన్మెంట్ ప్రై.లి., శ్రీశుభశ్వేత ఫిలిమ్స్ బ్యానర్పై తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఛార్మి, సత్య, వంశీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : సునీల్ కశ్యప్, ఎటిడింగ్ : ఎస్.ఆర్.శేఖర్, కెమెరా పి.జి.విందా, నిర్మాతలు : శ్వేతలానా, వరుణ్, తేజ, సి.వి.రావు, దర్శకత్వం పూరిజగన్నాథ్.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!









