ఎక్స్‌పో 2020 దుబాయ్ విజిటర్స్ కోసం వాట్సాప్ అన్ బ్లాక్ చేసిన యూఏఈ?

- September 30, 2021 , by Maagulf
ఎక్స్‌పో 2020 దుబాయ్ విజిటర్స్ కోసం వాట్సాప్ అన్ బ్లాక్ చేసిన యూఏఈ?

యూఏఈ: వాట్సాప్ ఇతర ఇంటర్నెట్ యాప్స్ ద్వారా కాల్స్‌కి అథారిటీస్ అనుమతించినట్లుగా తెలుస్తోంది. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ సర్వీసుల్ని చాలా యాప్స్ వినియోగిస్తున్నాయి. ఇంటర్నెట్ నుంచి ఇంటర్నెట్ వాయిస్ మరియు వీడియో కాల్స్ విషయమై యూఏఈలో కొద్ది సంవత్సరాలుగా నిషేధం వుంది. అయితే, వాట్సాప్ మరియు స్కైప్ ద్వారా వీటికి ప్రస్తుతం వెసులుబాటు కల్పించినట్లుగా కనిపిస్తోంది. ఈ విషయమై సమాచారం తెలుసుకునేందుకు ఎక్స్‌పో నిర్వాహకులు, యూఏఈ టెలికమ్యూనికేషన్స్ మరియు డిజిటల్ గవర్నమెంట్ రెగ్యులేటరీ అథారిటీని సంప్రదించారు. అయితే, ఎక్స్‌పో కోసమే వీటిని అనుమతించారా.? అన్న విషయమై స్పష్టత రావాల్సి వుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com