ఇండియా ఏవియేషన్ 2016లో ఖతార్ ఎయిర్వేస్ ఎ350
- March 17, 2016
ఇండియా ఏవియేషన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ మరియు కాన్ఫరెన్స్లో ఖతార్ ఎయిర్వేస్ ఎ350 ను ప్రదర్శించింది. న్యూ జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ అయిన ఎ350 మీడియం టు లాంగ్ హాల్ ఆపరేషన్స్ కోసం నిర్దేశించబడింది. ఇండియాలో ఇదే ఈ విమానానికి తొలి ప్రదర్శన. తెలంగాణ రాష్ట్రంలోని హైద్రాబాద్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ ఎగ్జిబిషన్ మరియు కాన్ఫరెన్స్ జరుగుతోంది. మార్చ్ 16 నుంచి 20 వరకు జరగనుంది ఈ ఎయిర్ షో. కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో హజరయ్యారు. ఖతార్ ఎయిర్వేస్ ఎ350 ఆపరేషన్స్ ఇటీవలే ఏడాది పూర్తిచేసుకున్నాయి. ప్రపంచంలోనే టెక్నలాజికల్లీ అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్గా ఎ350 పేరొందింది. ఫ్రాంక్ఫర్ట్, మ్యునిచ్, ఫిలడెల్ఫియా మరియు సింగపూర్లకు ఎ350 ప్రయాణిస్తోంది. అడిలైడ్, బోస్టన్ మరియు న్యూయార్క్లకు కొత్తగా విమానాలు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖతార్ ఎయిర్ వేస్ మొత్తం 8 ఎ350 విమానాల్ని నడుపుతోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







