ఎనిమిది రోజుల ఈశాన్యభారత పర్యటనలో భాగంగా అస్సాం విచ్చేసిన ఉపరాష్ట్రపతి
- October 03, 2021
గౌహతి: గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక చికిత్స కాన్సర్ సదుపాయాలను అందించడానికి ప్రైవేట్ రంగం ముందుకు రావాలని, రాష్ట్ర ప్రభుత్వాలతో భాగస్వామ్యమై పని చేయాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.ఈశాన్య భారతంలో ఎనిమిది రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం గౌహతి చేరుకున్న ఆయనకు, గవర్నర్, ముఖ్యమంత్రి సహా ఇతర ప్రముఖులు స్వాగతం పలికారు.అనంతరం రాష్ట్ర కాన్సర్ ఇనిస్టిట్యూట్ లో పి.ఈ.టి-ఎం.ఆర్.ఐ. మెషిన్ ను ప్రారంభించిన ఆయన, ఇది కచ్చితమైన రోగ నిర్ధారణకు గొప్పగా సహాయపడడమే గాకుండా, రోగులు రేడియేషన్ కు గురి కావడాన్ని తగ్గిస్తుందని ఆయన తెలిపారు.

అస్సాం ప్రభుత్వం, టాటా ట్రస్టుల భాగస్వామ్యంతో అమలు చేయాలని ప్రతిపాదించిన డిస్ట్రిబ్యూటెడ్ కాన్సర్ కేర్ మోడల్ అనే స్టెప్ డౌన్ కాన్సర్ కేర్ మోడల్ గురించి ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, ఈ పద్ధతిని కాన్సర్ రోగులకు సకారంలో సమర్థవంతమైన చికిత్స అందించడానికి ఇతర రాష్ట్రాలు సైతం అనుసరించాలని సూచించారు.
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా ఇలాంటి సమస్యలను అధిగమించవచ్చన్నఉపరాష్ట్రపతి, విద్యార్థులకు చిన్నతనం నుంచే ఆరోగ్య సంరక్షణ పట్ల అవగాహన పెంపొందించాలని, ఇందు కోసం తల్లిదండ్రులు, ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని సూచించారు.
ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా ఇలాంటి సమస్యలను అధిగమించవచ్చన్నఉపరాష్ట్రపతి, విద్యార్థులకు చిన్నతనం నుంచే ఆరోగ్య సంరక్షణ పట్ల అవగాహన పెంపొందించాలని, ఇందు కోసం తల్లిదండ్రులు, ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







