ట్రావెల్ బ్యాన్ ఉన్న దేశాలకు కూడా అనుమతి. బట్ కండిషన్స్ అప్లై
- October 04, 2021
సౌదీ: సౌదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా ట్రావెల్ బ్యాన్ చేసిన పది దేశాల్లోకి మళ్లీ ప్రయాణానికి అనుమతించింది. ఐతే కండిషన్ పెట్టింది. మానవతాథృక్పథంతో అత్యవసర సమయంలో ఆయా దేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తున్నామంది. బంధవుల మృతి, అవయవదానం చేసే వారు, హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న బంధువులను చూసేందుకు వెళ్లేవారికి అనుమతి ఇస్తామని జనరల్ డైరెక్టర్ ఆఫ్ పాస్ పోర్ట్ డిపార్ట్ మెంట్ తెలిపింది. ఇందుకు కోసం డైరెక్టరేట్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవచ్చని తెలిపింది. వెబ్ సైట్ లో ముందుగా మై సర్వీస్, ఆ తర్వాత పాస్ పోర్ట్, ఆ తర్వాత తవసుల్ అనే అప్షన్ ను ఎంచుకోవాలని కోరింది. వెబ్ సైట్ లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయని వాటిని చదివిన తర్వాత ప్రయాణం కోసం అప్లయ్ చేయాలని కోరింది. ప్రస్తుతానికి సౌదీ పది దేశాల్లోకి ప్రయాణాన్ని బ్యాన్ చేసింది. అందులో ఇండియా సహా పాకిస్తాన్, ఇండోనేషియా, ఈజిప్ట్, టర్కీ, బ్రెజిల్, ఇథియోపియా, వియత్నాం, అప్ఘనిస్తాన్, లెబనాన్ ఉన్నాయి. ఈ కంట్రీస్ కు అత్యవసరంగా వెళ్లే వారికి కోసం కొత్తగా నిబంధనలను సడలించింది.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







