సాధారణ పరిస్థితులు వచ్చే వరకు ఆన్ లైన్ వర్క్ కు అనుమతించండి

- October 05, 2021 , by Maagulf
సాధారణ పరిస్థితులు వచ్చే వరకు ఆన్ లైన్  వర్క్ కు అనుమతించండి

ఒమాన్: షాహీన్ తుపాన్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. చాలా ప్రాంతాల్లో జనం బయటకు వెళ్లలేని స్థితి ఏర్పడింది. ఈ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని మస్కట్ లేబర్ మినిస్ట్రీ ప్రైవేట్ సంస్థలకు ఓ విజ్ఞప్తి చేసింది. మళ్లీ సాధారణ పరిస్థితులు వచ్చే వరకు ఉద్యోగులను ఆఫీస్ లకు రావాలని కోరవద్దని తెలిపింది. ఎంప్లాయిస్, కార్మికులందరికీ ఎమర్జెన్సీ కింద సెలవు ఇవ్వాలని కోరింది. ఆన్ లైన్ లో వర్క్ చేసే అవకాశం ఉన్న వారితో వర్క్ ఫ్రమ్ హోం వర్క్ చేయించాలని కంపెనీలకు సూచించింది. తుపాన్ ఎఫెక్ట్ కారణంగా రాలేని వారికి ఎలాంటి ఫైన్ వేయవద్దని, సాలరీ కోత పెట్టవద్దని  ప్రైవేట్ సంస్థలకు ఆదేశించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com