బూస్టర్ డోస్ కు కువైట్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- October 05, 2021
కువైట్: కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నప్పటికీ సేఫ్ సైడ్ గా బూస్టర్ డోస్ ను కూాడా ఇవ్వాలని కువైట్ ప్రభుత్వం నిర్ణయించింది. రెండు డోస్ లు వేసుకున్నప్పటికీ కొంతమందికి కరోనా పాజిటివ్ వస్తోంది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులున్న 60 ఏళ్లుకు పైబడిన వ్యక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వీరికి రెండు డోస్ ల వ్యాక్సినేషన్ పూర్తైన సరే బూస్టర్ డోస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫ్రంట్ లైన వర్కర్స్, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వారికి కూడా బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు. ఈ మూడు గ్రూప్ ల వారికి బూస్టర్ డోస్ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. వచ్చే 6 నెలల పాటు ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. ప్రభుత్వం సూచించిన మూడు గ్రూప్ ల వారు మొబైల్ మెసేజ్ ద్వారా గానీ వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని కువైట్ ప్రభుత్వం తెలిపింది.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









