ఫుడ్ సెక్టార్ లో మళ్లీ పనులు షురూ! వీసాలకు పర్మిషన్
- October 05, 2021
కువైట్: కరోనా ఎఫెక్ట్ కాస్త తగ్గటంతో ఫుడ్ సెక్టార్ లో మళ్లీ పనులు షురూ చేయాలని కువైట్ ప్రభుత్వం భావిస్తోంది. కరోనా ఎమర్జెన్సీ మినిస్ట్రీయల్ కమిటీ సమావేశమై ఫుడ్ సెక్టార్ లో పనులను ప్రారంభించాలని నిర్ణయించింది. పొలాలు, రెస్టారెంట్స్, బేకరీస్, ఫుడ్ సప్లయ్ కి సంబంధించిన పనుల కోసం వీసాలను అనుమతించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కమర్షియల్, వర్కింగ్ వీసాలకు అనుమతించాలని భావిస్తున్నట్లు మినిస్ట్రీయల్ కమిటీ తెలిపింది. ఫుడ్ సప్లయ్ ఫ్యాక్టరీస్, పౌల్ట్రీ, డెయిరీ ప్రొడక్ట్స్, షాపింగ్ సెంటర్స్, వాటర్, అల్కహాల్ తయారీ సంస్థల్లో పనిచేసే వారికి కూడా మళ్లీ వీసాలు మంజూరు చేయనున్నారు. దీంతో చాలా మంది ఇతర దేశాల వారు పనుల కోసం కువైట్ వస్తారు. కరోనా కారణంగా చాలా ఎఫెక్టైన రంగాల్లో ఫుడ్ సెక్టార్ ఒకటి. తాజా నిర్ణయంతో ఫుడ్ సెక్టార్ లో మళ్లీ పుంజుకుంటుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







