ఫుడ్ సెక్టార్ లో మళ్లీ పనులు షురూ! వీసాలకు పర్మిషన్
- October 05, 2021
కువైట్: కరోనా ఎఫెక్ట్ కాస్త తగ్గటంతో ఫుడ్ సెక్టార్ లో మళ్లీ పనులు షురూ చేయాలని కువైట్ ప్రభుత్వం భావిస్తోంది. కరోనా ఎమర్జెన్సీ మినిస్ట్రీయల్ కమిటీ సమావేశమై ఫుడ్ సెక్టార్ లో పనులను ప్రారంభించాలని నిర్ణయించింది. పొలాలు, రెస్టారెంట్స్, బేకరీస్, ఫుడ్ సప్లయ్ కి సంబంధించిన పనుల కోసం వీసాలను అనుమతించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కమర్షియల్, వర్కింగ్ వీసాలకు అనుమతించాలని భావిస్తున్నట్లు మినిస్ట్రీయల్ కమిటీ తెలిపింది. ఫుడ్ సప్లయ్ ఫ్యాక్టరీస్, పౌల్ట్రీ, డెయిరీ ప్రొడక్ట్స్, షాపింగ్ సెంటర్స్, వాటర్, అల్కహాల్ తయారీ సంస్థల్లో పనిచేసే వారికి కూడా మళ్లీ వీసాలు మంజూరు చేయనున్నారు. దీంతో చాలా మంది ఇతర దేశాల వారు పనుల కోసం కువైట్ వస్తారు. కరోనా కారణంగా చాలా ఎఫెక్టైన రంగాల్లో ఫుడ్ సెక్టార్ ఒకటి. తాజా నిర్ణయంతో ఫుడ్ సెక్టార్ లో మళ్లీ పుంజుకుంటుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









