ఏపీ కరోనా అప్‌డేట్‌

- October 07, 2021 , by Maagulf
ఏపీ కరోనా అప్‌డేట్‌

గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 48,028 పరీక్షలు నిర్వహించగా.. 643 కేసులు నిర్ధారణ అయినట్లు గురువారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,55,306కి చేరింది. నిన్న కరోనా వల్ల ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,236కి చేరింది. 24 గంటల వ్యవధిలో 839 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,32,520కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8,550 యాక్టివ్‌ కేసులున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com