ఇజ్రాయిల్ నీటి సమస్యపై వినూత్న నిరసన...నగ్న ఫోటో షూట్
- October 18, 2021
ఇజ్రాయిల్: ఇజ్రాయిల్లో సుమారు 200 మంది మోడళ్లు .. నగ్నంగా ఫోటో షూట్లో పాల్గొన్నారు. డెడ్ సీ వద్ద ఉన్న ఎడారిలో వాళ్లంతా ఫోటో షూట్ చేశారు. అమెరికన్ ఆర్టిస్ట్ స్పెన్సర్ టునిక్ ఈ ఫోటోలను తీశారు. మోడళ్లు అందరూ శరీరానికి తెల్ల రంగు వేసుకుని ఫోటో షూట్లో పాల్గొన్నారు. ఇజ్రాయిల్లో నీటి సమస్య ఎక్కువగా ఉంది. అయితే డెడ్ సీ వద్ద జల సంపద తరిగిపోతోంది. ఆ సమస్యపై అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో న్యూడ్ ఫోటో షూట్ను ఆర్గనైజ్ చేశారు.
54 ఏళ్ల ఫోటోగ్రాఫర్ స్పెన్సర్ ఆదేశాలకు తగినట్లు మోడళ్లు ముందుకు కదిలారు. ఇజ్రాయిల్ పర్యాటక శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఫోటోగ్రాఫర్ ట్యూనిక్ గతంలో ఓ సారి వెయ్యి మంది మోడళ్లతో ఉప్పునీటి సముద్రమైన డెడ్ సీ వద్ద న్యూడ్ ఫోటోలు తీవారు. ప్రతి ఏడాది డెడ్ సీ సుమారు ఓ మీటరు మేర ఎండిపోతున్నది.
ఇజ్రాయిల్, జోర్డాన్లు ఎగువ ప్రాంతంలో నీటి మళ్లించడంతో డెడ్ సీ ఎండిపోవాల్సి వస్తోంది. దీనికి తోడు మైనింగ్ కూడా సమస్యగా మారింది. మోడళ్లకు వైట్ పేయింట్ వేయడానికి ట్యునిక్ ఓ కారణం చెప్పాడు. బైబిల్లోని కథ ప్రకారం.. లాట్ అనే వ్యక్తి భార్య ఉప్పు స్తంభంగా మారిపోతుందని, ఆ ఘటనను దృష్టిలో పెట్టుకుని మోడళ్లకు తెలుపు రంగు వేసినట్లు టునిక్ తెలిపారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







