ఇజ్రాయిల్ నీటి సమస్యపై వినూత్న నిరసన...నగ్న ఫోటో షూట్
- October 18, 2021
ఇజ్రాయిల్: ఇజ్రాయిల్లో సుమారు 200 మంది మోడళ్లు .. నగ్నంగా ఫోటో షూట్లో పాల్గొన్నారు. డెడ్ సీ వద్ద ఉన్న ఎడారిలో వాళ్లంతా ఫోటో షూట్ చేశారు. అమెరికన్ ఆర్టిస్ట్ స్పెన్సర్ టునిక్ ఈ ఫోటోలను తీశారు. మోడళ్లు అందరూ శరీరానికి తెల్ల రంగు వేసుకుని ఫోటో షూట్లో పాల్గొన్నారు. ఇజ్రాయిల్లో నీటి సమస్య ఎక్కువగా ఉంది. అయితే డెడ్ సీ వద్ద జల సంపద తరిగిపోతోంది. ఆ సమస్యపై అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో న్యూడ్ ఫోటో షూట్ను ఆర్గనైజ్ చేశారు.
54 ఏళ్ల ఫోటోగ్రాఫర్ స్పెన్సర్ ఆదేశాలకు తగినట్లు మోడళ్లు ముందుకు కదిలారు. ఇజ్రాయిల్ పర్యాటక శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఫోటోగ్రాఫర్ ట్యూనిక్ గతంలో ఓ సారి వెయ్యి మంది మోడళ్లతో ఉప్పునీటి సముద్రమైన డెడ్ సీ వద్ద న్యూడ్ ఫోటోలు తీవారు. ప్రతి ఏడాది డెడ్ సీ సుమారు ఓ మీటరు మేర ఎండిపోతున్నది.
ఇజ్రాయిల్, జోర్డాన్లు ఎగువ ప్రాంతంలో నీటి మళ్లించడంతో డెడ్ సీ ఎండిపోవాల్సి వస్తోంది. దీనికి తోడు మైనింగ్ కూడా సమస్యగా మారింది. మోడళ్లకు వైట్ పేయింట్ వేయడానికి ట్యునిక్ ఓ కారణం చెప్పాడు. బైబిల్లోని కథ ప్రకారం.. లాట్ అనే వ్యక్తి భార్య ఉప్పు స్తంభంగా మారిపోతుందని, ఆ ఘటనను దృష్టిలో పెట్టుకుని మోడళ్లకు తెలుపు రంగు వేసినట్లు టునిక్ తెలిపారు.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









