యానాంలో షూటింగ్ జరుపుకుంటున్న 'ఆక్సిజన్' చిత్రం

- March 19, 2016 , by Maagulf
యానాంలో షూటింగ్ జరుపుకుంటున్న 'ఆక్సిజన్' చిత్రం

టాలీవుడ్‌ నటులు గోపీ చంద్‌, రాశీఖన్నా జంటగా రూపుదిద్దుకుంటున్న చిత్రం 'ఆక్సిజన్‌'. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం యానాంలో జరుగుతోంది. కథానాయిన రాశీఖన్నా ఈ విషయాన్ని తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అదేవిధంగా అక్కడ సూర్యాస్తమయ సమయంలో తీసిన ఆహ్లాదకరమైన ఒక ఫొటోను పోస్ట్‌ చేశారు. శ్రీ సాయిరామ్‌ క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌. ఐశ్వర్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఈ సినిమా టైటిల్‌ లోగోను చిత్ర బృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com