వైజయంతీ మూవీస్ కి పూర్వ వైభవం...
- March 19, 2016
గత కొన్ని సంవత్సరాలుగా నిర్మించిన చిత్రాలతో వరుస వైఫల్యాలు చవిచూసిన మెగా ప్రొడ్యూసర్ అశ్వనీదత్ కు రాష్ట్ర విభజన వరంగా మారింది. ఏపీ రాజధాని ప్రాంతంలో అశ్వనీదత్ కు ఉన్న దాదాపు 150 ఎకరాలలో భారీ భవంతుల నిర్మాణం కోసం ప్రస్తుతం బిల్డర్లు ఈ మెగా నిర్మాత చుట్టూ చక్కర్లు కొడుతున్నారట.
దీంతో పాటు గుంటూరు, కృష్ణాజిల్లాల్లో అశ్వనిదత్ కు ఉన్న మిగతా ఆస్తుల విలువ కూడా అమాంతం పెరిగిపోవడంతో, వైజయంతీ మూవీస్ కి పూర్వ వైభవం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. "శక్తి" సినిమాతో పాటు అంతకు ముందు, తర్వాత వైజయంతి బ్యానర్లో వచ్చిన సినిమాలతో భారీగా నష్టపోయిన అశ్వనిదత్ కొంతకాలంగా సినిమా నిర్మాణానికి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.
తాజా పరిస్థితుల నేపథ్యంలో వైజయంతి బ్యానర్ తోపాటు, ఆయన కుమార్తెలు స్వప్నదత్, ప్రియాంకదత్ లు నిర్మించే త్రి ఏంజల్స్ బ్యానర్లో లో కూడా పలు సినిమాలు రాబోతున్నాయని టాలీవుడ్ టాక్. ఇప్పటికే ప్రిన్స్ మహేష్ బాబుతో ఒక సినిమాను, రామ్ చరణ్ తో మరో సినిమాను ఇటీవల అశ్వనీదత్ ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఏపీ ఎయిర్పోర్టుల్లో మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్
- జర్మనీలో ఫిజియోథెరపిస్టులు, ఆక్యుపేషనల్ థెరపిస్టులకు ఉద్యోగావకాశాలు
- ఉద్యోగులకు గుడ్ న్యూస్..జులై 15 నుండి కొత్త హెల్త్ స్కీమ్!
- బ్రతుకు ఆశతో 4 వేల కిలోమీటర్లు ప్రయాణం..
- సౌదీ ఎయిర్పోర్ట్స్లో ఇక పై పక్కా నిఘా
- చెన్నైలో పల్స్ పోలియోను ప్రారంభించిన సీఎం విజయ్!
- తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వానల హెచ్చరిక..
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..
- TTDకి అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..ఒక్కరికే Dh100,000 సొంతం..!!







