అమితాబ్ ఆలపించిన జాతీయ గీతంతో మ్యాచ్ ఆరంభం
- March 19, 2016
నిన్న జరిగిన భారత్ పాక్ మ్యాచ్ లో బాలీవుడ్ అగ్ర హీరోలు చూసేందుకు వచ్చారు. బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ కూడా ఈ మ్యాచ్ లైవ్ తిలకించారు. మ్యాచ్ ముందే తాను ఆ మ్యాచ్ తిలకిస్తానని చెప్పడంతో మ్యాచ్ తో పాటుగా బిగ్ బి ని కూడా చూసేందుకు వచ్చారు అభిమానులు. సిని, క్రికెట్ స్టార్స్ లు ఒక్కచోట కలిస్తే ఆ హంగామా ఎలా ఉంటుంది చెప్పండి. అంతేకాదు అమితాబ్ ఆలపించిన జాతీయ గీతంతో మ్యాచ్ ఆరంభించింది. అయితే మ్యాచ్ మొత్తం చాలా సరదాగా కనబడ్డ అమితబ్ ఇండియా విజయం అందుకున్న క్షణం తానో కుర్ర వాడిలా ఇండియా ఫ్లాగ్ ను ఎంతో ఉత్సాహంగా ఉప్పారు.. ఇండియన్ క్రికెట్ దిగ్గజం సచిన టెండుల్కర్ తో పాటు వి.వి.ఐ.పి జోన్ నుండి మ్యచ్ తిలకించిన అమితాబ్ మ్యాచ్ మొత్తం బాగా ఎంజాయ్ చేశారు.
మ్యాచ్ మొదలవడానికి స్టేడియంలో అమితాబ్ :
అంతేకాదు ఈ మ్యాచ్ లో అమితాబ్ తో పాటుగా అభిషేక్ కూడా సందడి చేయడం జరిగింది. ఇండియన్ డ్రెస్ అవతారంలో అభిషేక్ కనబడి అలరించాడు. ఇక ఎన్నో ఆశలతో భారత్ ను ఓడిద్దామనుకున్న పాక్ కల కలగానే ఉండింది. ఈడెన్ గార్డెన్ లో జరిగిన ఈ మ్యాచ్ లో వర్షం కారణంగా 18 ఓవర్లకు కుదించగా ముందు బ్యాటింగ్ చేసి 118 పరుగులు చేసిన పాక్.. అత్యంత స్వల్ప లక్ష్యంతో బరిలో దిగి భారత్ విజయ బావుటా ఎగురవేసింది. కోహ్లి వీరోచిత బ్యాటింగ్ తో అర్ధ సెంచరి పూర్తి చేసి అజేయంగా జట్టుని విజయ లక్ష్యాన్ని సాధించేలా చేశాడు. 15.5 ఓవర్లలోనే భారత తన లక్ష్యాన్ని సాధించడం జరిగింది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







