అమితాబ్ ఆలపించిన జాతీయ గీతంతో మ్యాచ్ ఆరంభం
- March 19, 2016
నిన్న జరిగిన భారత్ పాక్ మ్యాచ్ లో బాలీవుడ్ అగ్ర హీరోలు చూసేందుకు వచ్చారు. బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ కూడా ఈ మ్యాచ్ లైవ్ తిలకించారు. మ్యాచ్ ముందే తాను ఆ మ్యాచ్ తిలకిస్తానని చెప్పడంతో మ్యాచ్ తో పాటుగా బిగ్ బి ని కూడా చూసేందుకు వచ్చారు అభిమానులు. సిని, క్రికెట్ స్టార్స్ లు ఒక్కచోట కలిస్తే ఆ హంగామా ఎలా ఉంటుంది చెప్పండి. అంతేకాదు అమితాబ్ ఆలపించిన జాతీయ గీతంతో మ్యాచ్ ఆరంభించింది. అయితే మ్యాచ్ మొత్తం చాలా సరదాగా కనబడ్డ అమితబ్ ఇండియా విజయం అందుకున్న క్షణం తానో కుర్ర వాడిలా ఇండియా ఫ్లాగ్ ను ఎంతో ఉత్సాహంగా ఉప్పారు.. ఇండియన్ క్రికెట్ దిగ్గజం సచిన టెండుల్కర్ తో పాటు వి.వి.ఐ.పి జోన్ నుండి మ్యచ్ తిలకించిన అమితాబ్ మ్యాచ్ మొత్తం బాగా ఎంజాయ్ చేశారు.
మ్యాచ్ మొదలవడానికి స్టేడియంలో అమితాబ్ :
అంతేకాదు ఈ మ్యాచ్ లో అమితాబ్ తో పాటుగా అభిషేక్ కూడా సందడి చేయడం జరిగింది. ఇండియన్ డ్రెస్ అవతారంలో అభిషేక్ కనబడి అలరించాడు. ఇక ఎన్నో ఆశలతో భారత్ ను ఓడిద్దామనుకున్న పాక్ కల కలగానే ఉండింది. ఈడెన్ గార్డెన్ లో జరిగిన ఈ మ్యాచ్ లో వర్షం కారణంగా 18 ఓవర్లకు కుదించగా ముందు బ్యాటింగ్ చేసి 118 పరుగులు చేసిన పాక్.. అత్యంత స్వల్ప లక్ష్యంతో బరిలో దిగి భారత్ విజయ బావుటా ఎగురవేసింది. కోహ్లి వీరోచిత బ్యాటింగ్ తో అర్ధ సెంచరి పూర్తి చేసి అజేయంగా జట్టుని విజయ లక్ష్యాన్ని సాధించేలా చేశాడు. 15.5 ఓవర్లలోనే భారత తన లక్ష్యాన్ని సాధించడం జరిగింది.
తాజా వార్తలు
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!
- సీబీఎస్ఈ క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్ పై పేరెంట్స్ ఆందోళన..!!
- అల్ ఖోర్ మసీదులో కింగ్ సుల్తాన్ ఈద్ ప్రార్థనలు..!!
- ఈద్ వేడుకలు.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- మక్కాలోని గ్రాండ్ మసీదులో క్రౌన్ ప్రిన్స్ ఈద్ ప్రార్థనలు..!!
- తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు..
- రికార్డు స్థాయిలో కుప్పకూలిన రూపాయి విలువ









