పెట్రోల్ ధరలు తగ్గించం: సీఎం కేసీఆర్
- November 07, 2021
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తావుంటే తాను చూస్తూ ఊరుకోనని చెప్పారు సీఎం కేసీఆర్. పెట్రోల్, డీజిల్ రేట్లపై సెస్ ను కేంద్రమే పెంచిందన్నారు. సెస్ పెంచి రాష్ట్రాల వాటాను కేంద్రం ఎగ్గొట్టిందన్నారు సీఎం. పెట్రోల్ సెస్ ను పెంచిన కేంద్రం… దేశంలో పప్పులు, ఉప్పులు సహా అన్ని ధరలు పెరిగేందుకు కారణమైందని ఆరోపించారు. ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు పెరగడంతో.. అన్నింటి రేట్లు పెరిగాయన్నారు. వెంటనే పెట్రోల్ పై కేంద్రం పెంచిన సెస్ మొత్తాన్ని విరమించుకోవాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ రేట్ల వ్యాట్ ను తగ్గించే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ అన్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లను ప్రపంచంలో ఏ దేశం పెంచలేదన్నారు. కేంద్రమే సెస్ పెంచుతూ పోయిందని.. గతంలో ఎంత వ్యాట్ ఉందో అంతే వ్యాట్ తెలంగాణలో కొనసాగుతోందన్నారు.
“మేము ఒక్క రూపాయి వ్యాట్ పెంచలేదు. మేం వ్యాట్ తగ్గించాల్సిన అవసరం లేదు. పెట్రోల్, డీజిల్ పై తెలంగాణలో వ్యాట్ తగ్గించం. పెట్రోల్ డీజిల్ పై సెస్ రద్దు చేయాలని మేమే పోరాటం చేస్తాం. పెట్రోల్ డీజిల్ ధరలను కేంద్రం అడ్డదారిలో.. దొడ్డిదారిలో పెంచింది. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడమే తప్పు.” అని కేసీఆర్ కేంద్రంపై ఓ రేంజ్ లో ఫైరయ్యారు.
తాజా వార్తలు
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







