పెట్రోల్ ధరలు తగ్గించం: సీఎం కేసీఆర్
- November 07, 2021
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తావుంటే తాను చూస్తూ ఊరుకోనని చెప్పారు సీఎం కేసీఆర్. పెట్రోల్, డీజిల్ రేట్లపై సెస్ ను కేంద్రమే పెంచిందన్నారు. సెస్ పెంచి రాష్ట్రాల వాటాను కేంద్రం ఎగ్గొట్టిందన్నారు సీఎం. పెట్రోల్ సెస్ ను పెంచిన కేంద్రం… దేశంలో పప్పులు, ఉప్పులు సహా అన్ని ధరలు పెరిగేందుకు కారణమైందని ఆరోపించారు. ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు పెరగడంతో.. అన్నింటి రేట్లు పెరిగాయన్నారు. వెంటనే పెట్రోల్ పై కేంద్రం పెంచిన సెస్ మొత్తాన్ని విరమించుకోవాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ రేట్ల వ్యాట్ ను తగ్గించే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ అన్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లను ప్రపంచంలో ఏ దేశం పెంచలేదన్నారు. కేంద్రమే సెస్ పెంచుతూ పోయిందని.. గతంలో ఎంత వ్యాట్ ఉందో అంతే వ్యాట్ తెలంగాణలో కొనసాగుతోందన్నారు.
“మేము ఒక్క రూపాయి వ్యాట్ పెంచలేదు. మేం వ్యాట్ తగ్గించాల్సిన అవసరం లేదు. పెట్రోల్, డీజిల్ పై తెలంగాణలో వ్యాట్ తగ్గించం. పెట్రోల్ డీజిల్ పై సెస్ రద్దు చేయాలని మేమే పోరాటం చేస్తాం. పెట్రోల్ డీజిల్ ధరలను కేంద్రం అడ్డదారిలో.. దొడ్డిదారిలో పెంచింది. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడమే తప్పు.” అని కేసీఆర్ కేంద్రంపై ఓ రేంజ్ లో ఫైరయ్యారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







