ఇరాక్ ప్రధాని నివాసంపై ఉగ్రవాదుల డ్రోన్ దాడి.. తీవ్రంగా ఖండించిన ఒమన్

- November 08, 2021 , by Maagulf
ఇరాక్ ప్రధాని నివాసంపై ఉగ్రవాదుల డ్రోన్ దాడి.. తీవ్రంగా ఖండించిన ఒమన్

ఒమన్: ఆదివారం తెల్లవారుజామున ఇరాక్ ప్రధాని ముస్తాఫా అల్-ఖాదిమీ నివాసంపై పేలుడు పదార్థాల కూడిన డ్రోన్‌‌తో దాడి జరిగింది. ఈ దాడి నుంచి ప్రధాని త్రుటిలో తప్పించుకున్నట్టు ఇరాక్ సైన్యం వెల్లడించిన విషయం తెలిసిందే.  ఇరాక్ ప్రధాని నివాసంపై ఉగ్రవాదుల జరిపిన డ్రోన్ దాడిని ఒమన్ సుల్తానేట్ తీవ్రంగా ఖండించింది. ఇరాక్ భద్రత, స్థిరత్వాన్ని కాపాడటంలో ఇరాక్ కు సంఘీభావం తెలిపింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఓ ప్రకటనలో ఈ మేరకు వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com