ముస్లిమేతరులకు శుభవార్త చెప్పిన అబుధాబి..

- November 08, 2021 , by Maagulf
ముస్లిమేతరులకు శుభవార్త చెప్పిన అబుధాబి..

అబుధాబి: అబుధాబిలోని ముస్లిమేతరులకు ఇకపై సివిల్ చట్టం కింద వివాహాలు, విడాకులు, పిల్లల జాయింట్ కస్టడీకీ అనుమతిస్తున్నట్టు యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆదివారం ఉత్తర్వులను జారీ చేశారు.విడాకుల తరువాత భరణం, పితృత్వ నిరూపణ, వారసత్వం వంటి అంశాలను కూడా సివిల్ చట్టం పరిధిలోకి తెస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రపంచయవనికపై అబుధాబి ప్రాముఖ్యాన్ని, పేరుప్రఖ్యాతులు ఇనుమడించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూఏఈ అధ్యక్షుడు పేర్కొన్నారు. ప్రపంచంలోనే తొలిసారిగా అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరిస్తూ ఈ సివిల్ చట్టం రూపొందించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com