మూడో అమ్యూజ్మెంట్ పార్క్ ఏర్పాటుకు హైదరాబాద్ ఎంపిక
- March 22, 2016
దేశంలో అతిపెద్ద పార్క్ నిర్వాహక సంస్థ 'వండర్ లా' ఇప్పుడు నగరవాసులను అలరించనుంది. దేశంలోని తన మూడో అమ్యూజ్మెంట్ పార్క్ ఏర్పాటుకు హైదరాబాద్ను కేంద్రంగా ఎంచుకుంది. ఈ మేరకు రూ. 250 కోట్ల ఖర్చుతో అద్భుతమైన పార్క్ను అందుబాటులోకి తేనుంది. ఇప్పటికే బెంగుళూరు, కొచ్చిల్లో పదేళ్లుగా ఆ సంస్థ సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తోంది. హైదరాబాద్లో ఏర్పాటు చేయబోయే పార్క్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో 50 ఎకరాల స్థలంలో విస్తరించనుందని 'వండర్ లా హాలిడేస్ లిమిటెడ్' సంస్థ ఎం.డి. అరుణ్ తెలిపారు. హైదరాబాద్లో వండర్ లా అమ్యూజ్మెంట్ పార్క్ ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించినప్పటి నుంచి నగరవాసుల నుంచి మంచి స్పందన లభించిందని, 15 నెలలుగా అత్యున్నత ప్రమాణాలతో చేపట్టిన నిర్మాణం దాదాపు పూర్తికావచ్చిందన్నారు.ఏప్రిల్ 3వ వారంలో ప్రారంభిచనున్నామని ఆయన తెలిపారు. రెండేళ్ల క్రితం పార్క్ నిర్మాణం కోసం పబ్లిక్ ఇష్యూకి వెళ్లామని, అనుకున్న సమయానికల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేయగలిగామన్నారు. ప్రారంభం రోజే పదివేల మందికి ఆహ్లాదం పంచే సౌలభ్యం, 43 కొత్త ఆసక్తికరమైన ల్యాండ్, వాటర్ రైడ్స్ అందుబాటులో ఉన్నాయని, వచ్చే ఏడాదిలో మరో మూడు కొత్త ఆకర్షణలను జోడించనున్నామని అరుణ్ వివరించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







