మూడో అమ్యూజ్‌మెంట్ పార్క్ ఏర్పాటుకు హైదరాబాద్‌ ఎంపిక

- March 22, 2016 , by Maagulf
మూడో అమ్యూజ్‌మెంట్ పార్క్ ఏర్పాటుకు హైదరాబాద్‌ ఎంపిక

దేశంలో అతిపెద్ద పార్క్ నిర్వాహక సంస్థ 'వండర్ లా' ఇప్పుడు నగరవాసులను అలరించనుంది. దేశంలోని తన మూడో అమ్యూజ్‌మెంట్ పార్క్ ఏర్పాటుకు హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకుంది. ఈ మేరకు రూ. 250 కోట్ల ఖర్చుతో అద్భుతమైన పార్క్‌ను అందుబాటులోకి తేనుంది. ఇప్పటికే బెంగుళూరు, కొచ్చిల్లో పదేళ్లుగా ఆ సంస్థ సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తోంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే పార్క్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో 50 ఎకరాల స్థలంలో విస్తరించనుందని 'వండర్ లా హాలిడేస్ లిమిటెడ్' సంస్థ ఎం.డి. అరుణ్ తెలిపారు. హైదరాబాద్‌లో వండర్ లా అమ్యూజ్‌మెంట్ పార్క్ ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించినప్పటి నుంచి నగరవాసుల నుంచి మంచి స్పందన లభించిందని, 15 నెలలుగా అత్యున్నత ప్రమాణాలతో చేపట్టిన నిర్మాణం దాదాపు పూర్తికావచ్చిందన్నారు.ఏప్రిల్ 3వ వారంలో ప్రారంభిచనున్నామని ఆయన తెలిపారు. రెండేళ్ల క్రితం పార్క్ నిర్మాణం కోసం పబ్లిక్ ఇష్యూకి వెళ్లామని, అనుకున్న సమయానికల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేయగలిగామన్నారు. ప్రారంభం రోజే పదివేల మందికి ఆహ్లాదం పంచే సౌలభ్యం, 43 కొత్త ఆసక్తికరమైన ల్యాండ్, వాటర్ రైడ్స్ అందుబాటులో ఉన్నాయని, వచ్చే ఏడాదిలో మరో మూడు కొత్త ఆకర్షణలను జోడించనున్నామని అరుణ్ వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com