ఇకపై సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా అనుమతి
- November 30, 2021సౌదీ: సింగిల్ డోస్ COVID-19 వ్యాక్సిన్ వేసుకున్న అన్ని దేశాల నుండి వచ్చే ప్రయాణికులను అనుమతి ఇస్తామని సౌదీ అరేబియా వెల్లడించింది. ఈ మేరకు జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశాలు జారీ చేసింది. సౌదీ అరేబియాలోని అన్ని విమానయాన సంస్థలు కొత్త నిబంధనలను అమలు చేయాలని సూచించింది. ఈ కొత్త నిబంధనలు డిసెంబర్ 4 శనివారం ఉదయం 1:00 గంటల నుండి అమలులోకి వస్తాయని పేర్కొంది. అయితే సింగిల్ వ్యాక్సిన్ తీసుకొని వచ్చిన ప్యాసింజర్స్ సౌదీ అరేబియా వచ్చాకా తప్పనిసరిగా మూడు రోజుల ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ పీరియడ్ అమలు చేయబడుతుందని సర్క్యులర్ లో స్పష్టం చేసింది. ఈ నిబంధనలపై ప్రయాణికులకు అవగాహన కల్పించాలని కూడా విమానయాన సంస్థలకు సివిల్ ఏవియేషన్ సూచించింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ