ఇకపై సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా అనుమతి
- November 30, 2021
సౌదీ: సింగిల్ డోస్ COVID-19 వ్యాక్సిన్ వేసుకున్న అన్ని దేశాల నుండి వచ్చే ప్రయాణికులను అనుమతి ఇస్తామని సౌదీ అరేబియా వెల్లడించింది. ఈ మేరకు జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశాలు జారీ చేసింది. సౌదీ అరేబియాలోని అన్ని విమానయాన సంస్థలు కొత్త నిబంధనలను అమలు చేయాలని సూచించింది. ఈ కొత్త నిబంధనలు డిసెంబర్ 4 శనివారం ఉదయం 1:00 గంటల నుండి అమలులోకి వస్తాయని పేర్కొంది. అయితే సింగిల్ వ్యాక్సిన్ తీసుకొని వచ్చిన ప్యాసింజర్స్ సౌదీ అరేబియా వచ్చాకా తప్పనిసరిగా మూడు రోజుల ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ పీరియడ్ అమలు చేయబడుతుందని సర్క్యులర్ లో స్పష్టం చేసింది. ఈ నిబంధనలపై ప్రయాణికులకు అవగాహన కల్పించాలని కూడా విమానయాన సంస్థలకు సివిల్ ఏవియేషన్ సూచించింది.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









