సాల్మియాలో 30 వేల 'స్మార్ట్ మీటర్ల' ఇన్స్టాల్
- November 30, 2021
కువైట్: సాల్మియాలో ఇప్పటివరకు వాటర్, విద్యుత్ కలెక్షన్లకు 30,000 స్మార్ట్ మీటర్లను ఇన్ స్టాల్ చేసినట్లు విద్యుత్, నీటి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇది ఈ ప్రాంతంలో అవసరమైన మీటర్లలో దాదాపు సగం మీటర్లకు సమానం. గత రెండు నెలలుగా వాటర్, విద్యుత్ కలెక్షన్లకు స్మార్ట్ మీటర్లను అమర్చుతున్న విషయం తెలిసిందే. హవల్లిలో ఒక నెలలోపు ఇన్స్టాలేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు చెప్పారు. మీటర్లను ఇన్స్టాల్ చేసే ప్రక్రియ వేగం పెరిగిందని, రోజుకు 1,000 మీటర్లను ఇన్ స్టాల్ చేస్తున్నట్లు అధికారులు వివరించారు. స్మార్ట్ మీటర్లను ఇన్స్టాల్ చేసిన వారందరూ తమ పాత బకాయిలు చెల్లించారని అధికార వర్గాలు కోరాయి. కరోనా మహమ్మారి సమయం కంటే ఇప్పుడు బిల్లుల వసూళ్లు పెరిగాయని అధికారులూ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 370 మిలియన్ దినార్లను వసూలు చేయాలని మంత్రిత్వ శాఖ టార్గెట్ పెట్టగా.. ఇప్పటివరకు 300 మిలియన్ దినార్లను వసూలు చేసినట్ల అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









