దుబాయ్ ఎక్స్‌పో 2020: 150 దిర్హామ్ లకే ఫెస్టివ్ పాస్

- December 01, 2021 , by Maagulf
దుబాయ్ ఎక్స్‌పో 2020: 150 దిర్హామ్ లకే ఫెస్టివ్ పాస్

దుబాయ్: దుబాయ్ ఎక్స్‌పో 2020 అద్భుతాలను మనసారా ఆస్వాదించేందుకు ఎక్స్ పో నిర్వహకులు 150 దిర్హాంలకే ఫెస్టివ్ పాస్ ఆఫర్ ను ప్రకటించారు. UAE ఇండిపెండెన్స్ డే రోజున మెగా ఈవెంట్‌ లోకి ఎంట్రీ ఫ్రీ కాగా.. వరల్డ్ ఫెయిర్ లోని అద్భుతాలను ఆనందించేందుకు ఆ ఒక్క రోజు సరిపోదు. అందుకే డిసెంబర్ 31 వరకు ఫెస్టివ్ పాస్ లను అమ్ముతున్నారు.  సీజన్ పాస్ ను ఫెస్టివ్ పాస్ తో అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఎక్స్‌పోలో UAE స్వర్ణోత్సవాన్ని డిసెంబర్ 1 నుండి 4 వరకు 'ది జర్నీ ఆఫ్ ది 50'తో సెలబ్రేట్ చేయనున్నారు. అలాగే అల్ వాస్ల్ ప్లాజా క్రిస్మస్ ట్రీ లైటింగ్‌, ఫెస్టివ్ ట్రైన్స్, మెరిసే స్ట్రీట్ లైట్స్, మిరుమిట్లు గొలిపే క్రాకరీ వెలుగులు, 3D ఒంటెలు, జెయింట్ స్నో గ్లోబ్స్, రెయిన్ డీర్ లను ఆనందించవచ్చు. వీటితో పాటుగా కరోల్ కచేరీలు, ఎగిరే పియానోలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని ఈవెంట్ నిర్వహకులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com